Bharat Jodo Yatra: దీపావళి పర్వదినం, కాంగ్రెస్ చీఫ్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో మూడు రోజుల బ్రేక్ అనంతరం.. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ నుంచి రాహుల్గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో మక్తల్కు చేరుకున్నారు. యాత్ర ప్రారంభమై గురువారం నాటికి 50 రోజులు కాగా… 50వ రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ 26 కిలో మీటర్ల మేర నడిచారు. ఉదయం మొదలైన ఈ యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు.
Read Also: Rajnath Singh: పాకిస్తాన్కు వార్నింగ్.. త్వరలో స్వాధీనం చేసుకుంటాం
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 50 రోజుల్లోనే 5వ రాష్ట్రంలో అడుగుపెట్టింది. తమిళనాడు నుంచి మొదలైన యాత్ర కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లను దాటి తెలంగాణలోకి అడుగుపెట్టింది. మరోవైపు తెలంగాణలో రాహుల్ యాత్రకు ఊహించిన దాని కంటే అధిక స్పందన లభిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాహుల్ యాత్రకు మక్తల్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మత్స్యకారులు వినూత్నంగా స్వాగతం పలికారు. నీటిలో దిగిన మత్స్యకారులు.. వీ ఆర్ ఆల్వేస్ విత్ యూ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని రాహుల్కు స్వాగతం పలికారు.
Read Also: అందాల సెగలు పుట్టిస్తోన్న టిల్లు భామ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మూడు రోజుల విరామం తర్వాత తెలంగాణలో రెండో రోజు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ నుంచి ఉదయం 6.30 గంటలకు భారత్ జోడో పాదయాత్రను రాహుల్ గాంధీ పునఃప్రారంభించారు. రాహుల్ ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు చేయనున్నారు. ఇవాళ 26 కిలో మీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది.
