Site icon NTV Telugu

Rahul Gandhi : తెలంగాణలో 4వ రోజు ప్రారంభమైన రాహుల్‌ యాత్ర

Rahul Gandhi

Rahul Gandhi

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఈనెల 23న తెలంగాణలోకి రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రవేశించింది. అయితే.. దీపావళి విరామం తరువాత మళ్లీ 27వ తేదీ నుంచి రాహుల్‌ గాంధీ పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. మహబూబ్‌ నగర్ నుంచి జడ్చర్ల జంక్షన్ వరకు పాదయాత్ర సాగనుంది. ఈ రోజు 20.3 కిలో మీటర్ల మేర రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ రోజు పాలమూరు అధ్యయన వేదిక, మైనారిటీ రిసేర్వేషన్ జేఏసీ, ప్రొఫెసర్‌ సుశి తారు తో చర్చించనున్నారు రాహుల్‌ గాంధీ. 2 గంటలకు విద్యావేత్తలతో భేటీ కానున్నారు.

Also Read : Nancy Pelosi: నాన్సీ పెలోసీ ఇంట్లో ఆగంతుకుడి కలకలం.. ఆమె భర్తపై దాడి

ధర్మాపూర్ లో ఉదయం 6 గంటలకు రాహుల్ యాత్ర ప్రారంభం కాగా.. మహబూబ్ నగర్ పట్టణం మీదుగా యాత్ర సాగనుంది. ఏనుకొండ లో 10. 30 గంటలకు విరామం.. అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో లంచ్ చేయనున్నారు రాహుల్. తిరిగి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. జడ్చర్ల జంక్షన్ లో రాహుల్ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వద్ద రాహుల్ రాత్రి బస చేయనున్నారు రాహుల్‌ గాంధీ. అయితే.. నేడు పాదయాత్ర సినీనటి పూనమ్ కౌర్ రాహుల్ యాత్రలో పాల్గొన్నారు.

Exit mobile version