ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
- యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో డబ్లిన్ గార్డియన్స్ యజమానిగా రాహుల్ ద్రవిడ్
- డబ్లిన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్న రవిచంద్రన్ అశ్విన్
- యూరప్లో క్రికెట్ అభివృద్ధే ETPL ప్రధాన లక్ష్యమని తెలిపిన ద్రవిడ్
- మొత్తం ఆరు జట్లు పాల్గొననున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ETPL Dublin Guardians: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో కీలక పాత్ర పోషించనున్నారు. డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీ యజమానిగా ద్రవిడ్ను అధికారికంగా ప్రకటించారు. యూరప్లో క్రికెట్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభిస్తున్న ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. “యూరప్లో క్రికెట్ను మరింత బలోపేతం చేయడం, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం ETPL ప్రధాన లక్ష్యం. అదే నన్ను ఈ లీగ్ వైపు ఆకర్షించింది. డబ్లిన్లో ఇప్పటికే క్రికెట్కు మంచి ఆదరణ ఉంది. భవిష్యత్ తరానికి మంచి వేదికగా ఈ లీగ్ మారుతుంది” అని తెలిపారు.
డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టు బెల్ఫాస్ట్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, రోటర్డామ్, ఆమ్స్టర్డామ్ జట్లతో పోటీపడనుంది. ఈ టోర్నీ ప్రారంభ కార్యక్రమానికి ETPL సహ వ్యవస్థాపకుడు అభిషేక్ బచ్చన్ తో పాటు పలువురు ఫ్రాంచైజీ యజమానులు హాజరయ్యారు. అలాగే జోంటీ రోడ్స్, క్రిస్ గేల్, స్టీవ్ వా వంటి దిగ్గజాలు కూడా ఈ లీగ్తో అనుబంధం కలిగి ఉన్నారు. క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ప్రారంభమవుతున్న ఈ లీగ్లో డబ్లిన్, బెల్ఫాస్ట్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, రోటర్డామ్, ఆమ్స్టర్డామ్ నగరాల జట్లు పాల్గొంటాయి.
Also Read
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డు ప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ తదితరులు కూడా ఈ లీగ్లో ఆడనున్నారు. ETPL తొలి సీజన్ ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు నిర్వహించనున్నారు. యూరప్లో క్రికెట్ విస్తరణకు ఈ లీగ్ కీలకంగా మారనుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!