ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
- యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో డబ్లిన్ గార్డియన్స్ యజమానిగా రాహుల్ ద్రవిడ్
- డబ్లిన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్న రవిచంద్రన్ అశ్విన్
- యూరప్లో క్రికెట్ అభివృద్ధే ETPL ప్రధాన లక్ష్యమని తెలిపిన ద్రవిడ్
- మొత్తం ఆరు జట్లు పాల్గొననున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ETPL Dublin Guardians: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో కీలక పాత్ర పోషించనున్నారు. డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీ యజమానిగా ద్రవిడ్ను అధికారికంగా ప్రకటించారు. యూరప్లో క్రికెట్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభిస్తున్న ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. “యూరప్లో క్రికెట్ను మరింత బలోపేతం చేయడం, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం ETPL ప్రధాన లక్ష్యం. అదే నన్ను ఈ లీగ్ వైపు ఆకర్షించింది. డబ్లిన్లో ఇప్పటికే క్రికెట్కు మంచి ఆదరణ ఉంది. భవిష్యత్ తరానికి మంచి వేదికగా ఈ లీగ్ మారుతుంది” అని తెలిపారు.
డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టు బెల్ఫాస్ట్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, రోటర్డామ్, ఆమ్స్టర్డామ్ జట్లతో పోటీపడనుంది. ఈ టోర్నీ ప్రారంభ కార్యక్రమానికి ETPL సహ వ్యవస్థాపకుడు అభిషేక్ బచ్చన్ తో పాటు పలువురు ఫ్రాంచైజీ యజమానులు హాజరయ్యారు. అలాగే జోంటీ రోడ్స్, క్రిస్ గేల్, స్టీవ్ వా వంటి దిగ్గజాలు కూడా ఈ లీగ్తో అనుబంధం కలిగి ఉన్నారు. క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ప్రారంభమవుతున్న ఈ లీగ్లో డబ్లిన్, బెల్ఫాస్ట్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, రోటర్డామ్, ఆమ్స్టర్డామ్ నగరాల జట్లు పాల్గొంటాయి.
Also Read
- MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
- PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
- CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్గా మారిందని ఆరోపణ..
- Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డు ప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ తదితరులు కూడా ఈ లీగ్లో ఆడనున్నారు. ETPL తొలి సీజన్ ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు నిర్వహించనున్నారు. యూరప్లో క్రికెట్ విస్తరణకు ఈ లీగ్ కీలకంగా మారనుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
-
PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
-
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్గా మారిందని ఆరోపణ..
-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
-
Mayawati: ఎన్నికల వేళ మేనల్లుడికి మాయావతి షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!