Raghunandan Rao : 1500 కోట్ల భూములని ఓ పెద్దమనిషికి కట్టబెడుతున్నారు…
- ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు
- ఇందులో 170 ఎకరాలు ప్రభుత్వం ఇండస్ట్రీ లకి ఇచ్చింది
- అప్పటి టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేయాలని అనుకున్నారు : రఘునందన్ రావు
Raghunandan Rao : కేసీఆర్ కుటుంబం ధరణి పేరుతో దోచుకున్నది కక్కిస్తామని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఢిల్లీ నేతలు చెప్పారని, చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకొని కొందరు మంత్రులు భూములు ఎలా కబ్జా పెట్టాలని చూస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శంకర పల్లి మండలం కొండకల్, రామ చంద్ర పురం మండలం వెలిమల గ్రామాల మధ్య కొంత మిగులు ల్యాండ్ ఉందన్నారు. 450 ఎకరాలు ఉంటుంది… 1993 లో అక్కడ ఉండే గిరిజనులు ఆ భూములు లో వ్యవసాయం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని, ఇందులో 170 ఎకరాలు ప్రభుత్వం ఇండస్ట్రీలకి ఇచ్చిందన్నారు. మిగులు భూమిని వేలిమల గ్రామానికి కేటాయించింది… ఆ భూమి ఎవరి కబ్జా లో ఉంది వారికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని, అప్పటి టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేయాలని అనుకున్నారన్నారు రఘునందన్ రావు. ఆ నేత ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారని, చివరకు 85 ఎకరాలు మిగిలింది ఆ భూమి నీ గిరిజనులు దున్నుకుంటున్నారన్నారు రఘునందన్ రావు.
Tabu: యంగ్ హీరోయిన్లను తలదన్నేలా సీనియర్ హీరోయిన్.. ఎక్కడా తగ్గట్లేదుగా!
Also Read
అంతేకాకుండా..’Ccla లో అప్పుడు ఉన్న సారే ఇప్పుడు ఉన్నారు… అప్పుడు అటు ఎన్ని సూట్ కేస్ లు ఇచ్చారు… ఇపుడు ఇటు కూడా అన్నే సూట్ కేసు లు ఇచ్చాడు. అరబిందో ఫార్మా నిత్యా నంద రెడ్డి అయన కుటుంబ సభ్యులు ఆ భూమి తమదని క్లెయిమ్ చేసుకుంటున్నారు.. ఆ భూముల్లోకి పోలీస్ లు వెళ్లొద్దని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ నెల 8 న.. అయినా పోలీస్ లు అక్కడకి వెళ్లి గోడలు కట్టిస్తున్నారు… అక్కడ రైతులు పై 17 కేసు లు పెట్టారు… 15 వందల కోట్ల భూములని ఓ పెద్దమనిషి కి కట్ట బెడుతున్నారు… కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్న ఒక మంత్రి తన కుటుంబ సభ్యుల మీద మార్చుకుంటున్నారు..’ అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.
Aishwarya Rajesh: నలుగురు పిల్లల తల్లైనా ‘భాగ్యం’ బంగారమబ్బా!
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో