Operation Baam: బలూచిస్తాన్ ఎప్పటికీ పాకిస్తాన్లో భాగం కాదు.. పాక్ కు హెచ్చరిక
- బలూచిస్తాన్ ఎప్పటికీ పాకిస్తాన్లో భాగం కాదు
- బలూచ్ నేషనల్ మూవ్మెంట్ (BNM) సమాచార కార్యదర్శి ఖాజీ దాద్ మొహమ్మద్ రెహాన్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో స్వాతంత్ర్యం కోసం డిమాండ్ పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం, బలూచ్ నేషనల్ మూవ్మెంట్ ‘ఆపరేషన్ బామ్ (ఉదయం)’ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఆపరేషన్ కింద, బలూచ్ జాతీయ ఉద్యమ యోధులు పాకిస్తాన్లోని పంజ్గుర్, సుర్బ్, కెచ్, ఖరాన్లతో సహా అనేక జిల్లాల్లో దాదాపు 17 దాడులు చేశారు. ఇదిలా ఉండగా, బలూచిస్తాన్ “ఎప్పటికీ పాకిస్తాన్లో భాగం కాదు” అని బలూచ్ నేషనల్ మూవ్మెంట్ (BNM) సమాచార కార్యదర్శి ఖాజీ దాద్ మొహమ్మద్ రెహాన్ ఆదివారం అన్నారు. వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రెహాన్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక ఉనికిని నిర్మూలించే లక్ష్యంతో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) దీనిని తన సాయుధ ప్రతిఘటనలో వ్యూహాత్మక మార్పుగా అభివర్ణించింది.
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
“ఆపరేషన్ బామ్, అంటే ‘ఉదయం’, మా పోరాటంలో ఒక మలుపును సూచిస్తుంది. బలూచ్ ప్రజలు పాకిస్తాన్ అణచివేతను ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారని ఇది చూపిస్తుంది అని రెహాన్ చెప్పినట్లు వార్తా సంస్థ ANI పేర్కొంది. బలూచ్ ప్రజలు తమను తాము పరిపాలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. బలూచిస్తాన్ స్వతంత్రంగా మారితే అరాచకం రాజ్యమేలుతుందని పాకిస్తాన్, దాని మిత్రదేశాలు వ్యాప్తి చేస్తున్నాయని రెహాన్ మండిపడ్డారు. పాకిస్తాన్ పార్లమెంటును బహిష్కరించిన మొదటి పార్టీ మాదేనని రెహాన్ అన్నారు. పాకిస్తాన్ పాలనలో జీవించడం మాకు ఇష్టం లేదని మేము స్పష్టం చేసాము. పాకిస్తాన్లో పరిమిత స్వయంప్రతిపత్తి లేదా సింబాలిక్ హక్కుల కోసం కాదు, పూర్తి స్వాతంత్ర్యం కోసం మా పోరాటం అని అన్నారు.
Also Read:Delhi: తప్పిపోయిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ మృతదేహం లభ్యం..
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ను కూడా రెహాన్ విమర్శించారు, వారు బలూచ్ వనరులను దోపిడీ చేస్తున్నారని, ప్రతిఫలంగా ఏమీ ఇవ్వరని అన్నారు. “మా భూమిపై బిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు, కానీ బలూచ్ ప్రజలు పేదలు, అణచివేతకు గురవుతున్నారు. వారి వనరులను కోల్పోతున్నారు” అని ఆయన అన్నారు. “బలూచిస్తాన్ పంజాబ్ లేదా పాకిస్తాన్లోని మరే ఇతర ప్రాంతానికి చెందినది కాదు, బలూచ్కు చెందినది మాత్రమే అని ఆయన అన్నారు. “బలూచిస్తాన్ పోరాటం న్యాయమైనది, అనివార్యమైనది అని ప్రపంచం అర్థం చేసుకోవాలి. ఆపరేషన్ బామ్ స్వేచ్ఛ కోసం మన కొత్త ప్రయత్నానికి ప్రారంభం మాత్రమే” అని రెహాన్ ప్రపంచ సమాజానికి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!