PV Sindhu Wedding: వివాహ బంధంలోకి పీవీ సింధు.. దీవి ప్రత్యేకతలు ఇవే!
- ఒక్కటైన సింధు, సాయి
- ఆదివారం రాత్రి 11.20కి సింధుకి పెళ్లయింది
- ఉదయసాగర్ దీవి ప్రత్యేకతలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇన్నాళ్లూ రాకెట్ పట్టి మైదానంలో ప్రత్యర్థులను హడలెత్తించిన భారత స్టార్ పీవీ సింధు.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో సింధు వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్లో ఆదివారం రాత్రి 11.20కి మూడుముళ్ల బంధంతో సింధు, సాయి ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథులు మాత్రమే హాజరయ్యారు. కొత్త జంటకు ప్రముఖులు, ఫాన్స్, నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.
పీవీ సింధు తన పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీ సహా దేశంలోని అత్యంత ప్రముఖులను ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాంటి ప్రముఖులను సింధు ఆహ్వానించారు. తెలుగు సంప్రదాయబద్ధంగా, రాజస్థాన్ సంస్కృతి ప్రతిబింబించేలా జరిగిన పెళ్లికి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్లో సింధు, సాయిల రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్కు రెండు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలు హాజరుకానున్నారు.
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
Also Read: Champions Trophy 2025: దుబాయ్లో భారత్ మ్యాచ్లు.. భారత్ అర్హత సాధించకపోతే..!
రాజస్థాన్ ఉదయ్పూర్లోని ఉదయసాగర్లో పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి జరిగింది. ఇది ఓ దీవి. ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న ఈ దీవి 21 ఎకరాల్లో ఉంటుంది. రఫల్ సంస్థ ఈ దీవిని అద్భుతంగా తీర్చిదిద్దింది. దీవి మధ్యలో ఉండే భారీ రిసార్ట్లో గెస్టుల కోసం 100 గదులను ఏర్పాటు చేసింది. ఈ దీవికి వెళ్లడానికి పడవల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. దీవి చుట్టూ ఉన్న సరస్సులో పడవల్లో వెళుతుంటే ప్రత్యేక అనుభూతిని పొందుతారు. రిసార్టులో ఒక గదికి ఒక రోజుకు ఒక లక్ష అద్దె ఛార్జ్ చేస్తారు. వధూవరుల సంప్రదాయాలకు తగ్గట్టుగా రిసార్టును రూపొందిస్తారు.
తాజావార్తలు
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్తో మరో క్రేజీ ప్రయోగం!
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!