Pushpa 2 : పుష్ప 2 ఈవెంట్… ఆయన మాత్రం రావట్లేదట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ కానుంది. ఇందుకోసం నగరంలోని చారిత్రాత్మక గాంధీ మైదాన్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవల, అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఈ చిత్రం ట్రైలర్ను పాట్నాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్, రష్మిక పాట్నాకు రానున్నారు. గాంధీ మైదాన్లో సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. పుష్పా ఫ్రాంచైజీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also:Jyothika : కంగువ నెగిటివ్ రివ్యూస్ పై జ్యోతిక వార్నింగ్ పోస్ట్
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
- Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
అందుకే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరవుతారని భావిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం గాంధీ మైదాన్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గాంధీ మైదాన్లోని గేట్ నంబర్ 10 నుండి అభిమానులు ఎంట్రీ ఇస్తారు, అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రవేశానికి ఉచిత పాస్లు ఈరోజు అందజేశారు. సాధారణంగా ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై వంటి పెద్ద నగరాల్లో ఏదైనా పెద్ద సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తారు. కానీ పుష్ప 2 ట్రైలర్ను పాట్నాలో లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాట్నాలో పుష్పరాజ్ సందడి హెవీ లౌడ్ గా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ నేపథ్యంలో మొదటి ప్రమోషనల్ ఈవెంట్ అక్కడే పెడుతున్నారు.
Read Also:Amit Shah: ఎన్నికల ర్యాలీలు రద్దు చేసుకున్న అమిత్ షా.. హఠాత్తుగా ఢిల్లీకి ప్రయాణం.. కారణం ఇదే?
ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అటెండ్ అవ్వబోతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పబ్లిక్ వచ్చే అవకాశం ఉందని స్థానిక పోలీసులు భావిస్తున్నారు. వారితో పాటు టెక్నీషియన్స్ కూడా రానున్నారు. అయితే డైరెక్టర్ సుకుమార్ మాత్రం పాట్నాలో జరగబోయే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఈ మూవీ పెండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలా ఉన్నాయంట. వాటిని పూర్తి చేయడం పై సుకుమార్ పూర్తిగా ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాట్నాలో జరగబోయే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లడం లేదని అనుకుంటున్నారు. వీటితో పాటు మిగిలిన ప్రమోషనల్ ఈవెంట్స్ లలో చాలా వాటికి సుకుమార్ హాజరుకాకపోవచ్చనే టాక్ నడుస్తోంది. ‘పుష్ప’ తరహాలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా రిలీజ్ కి ముందు సుకుమార్ కనిపించొచ్చని ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
-
Pat Cummins: ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లు నటించా.. పంజాబ్ స్టార్ ప్లేయర్ ఈజీగా బుట్టలో పడ్డాడు!
-
Vijay’s Convoy Security Withdrawn: విజయ్ కి షాక్ భద్రత తొలగింపు.. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ
-
Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!