Pushpa 2 : పుష్ప 2 ఈవెంట్… ఆయన మాత్రం రావట్లేదట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ కానుంది. ఇందుకోసం నగరంలోని చారిత్రాత్మక గాంధీ మైదాన్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవల, అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఈ చిత్రం ట్రైలర్ను పాట్నాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్, రష్మిక పాట్నాకు రానున్నారు. గాంధీ మైదాన్లో సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. పుష్పా ఫ్రాంచైజీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also:Jyothika : కంగువ నెగిటివ్ రివ్యూస్ పై జ్యోతిక వార్నింగ్ పోస్ట్
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
అందుకే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరవుతారని భావిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం గాంధీ మైదాన్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గాంధీ మైదాన్లోని గేట్ నంబర్ 10 నుండి అభిమానులు ఎంట్రీ ఇస్తారు, అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రవేశానికి ఉచిత పాస్లు ఈరోజు అందజేశారు. సాధారణంగా ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై వంటి పెద్ద నగరాల్లో ఏదైనా పెద్ద సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తారు. కానీ పుష్ప 2 ట్రైలర్ను పాట్నాలో లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాట్నాలో పుష్పరాజ్ సందడి హెవీ లౌడ్ గా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ నేపథ్యంలో మొదటి ప్రమోషనల్ ఈవెంట్ అక్కడే పెడుతున్నారు.
Read Also:Amit Shah: ఎన్నికల ర్యాలీలు రద్దు చేసుకున్న అమిత్ షా.. హఠాత్తుగా ఢిల్లీకి ప్రయాణం.. కారణం ఇదే?
ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అటెండ్ అవ్వబోతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పబ్లిక్ వచ్చే అవకాశం ఉందని స్థానిక పోలీసులు భావిస్తున్నారు. వారితో పాటు టెక్నీషియన్స్ కూడా రానున్నారు. అయితే డైరెక్టర్ సుకుమార్ మాత్రం పాట్నాలో జరగబోయే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఈ మూవీ పెండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలా ఉన్నాయంట. వాటిని పూర్తి చేయడం పై సుకుమార్ పూర్తిగా ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాట్నాలో జరగబోయే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లడం లేదని అనుకుంటున్నారు. వీటితో పాటు మిగిలిన ప్రమోషనల్ ఈవెంట్స్ లలో చాలా వాటికి సుకుమార్ హాజరుకాకపోవచ్చనే టాక్ నడుస్తోంది. ‘పుష్ప’ తరహాలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా రిలీజ్ కి ముందు సుకుమార్ కనిపించొచ్చని ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!