Pushpa 2 : పుష్ప 2 ఈవెంట్… ఆయన మాత్రం రావట్లేదట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ కానుంది. ఇందుకోసం నగరంలోని చారిత్రాత్మక గాంధీ మైదాన్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవల, అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఈ చిత్రం ట్రైలర్ను పాట్నాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్, రష్మిక పాట్నాకు రానున్నారు. గాంధీ మైదాన్లో సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. పుష్పా ఫ్రాంచైజీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also:Jyothika : కంగువ నెగిటివ్ రివ్యూస్ పై జ్యోతిక వార్నింగ్ పోస్ట్
Also Read
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
అందుకే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరవుతారని భావిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం గాంధీ మైదాన్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గాంధీ మైదాన్లోని గేట్ నంబర్ 10 నుండి అభిమానులు ఎంట్రీ ఇస్తారు, అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రవేశానికి ఉచిత పాస్లు ఈరోజు అందజేశారు. సాధారణంగా ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై వంటి పెద్ద నగరాల్లో ఏదైనా పెద్ద సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తారు. కానీ పుష్ప 2 ట్రైలర్ను పాట్నాలో లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాట్నాలో పుష్పరాజ్ సందడి హెవీ లౌడ్ గా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ నేపథ్యంలో మొదటి ప్రమోషనల్ ఈవెంట్ అక్కడే పెడుతున్నారు.
Read Also:Amit Shah: ఎన్నికల ర్యాలీలు రద్దు చేసుకున్న అమిత్ షా.. హఠాత్తుగా ఢిల్లీకి ప్రయాణం.. కారణం ఇదే?
ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అటెండ్ అవ్వబోతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పబ్లిక్ వచ్చే అవకాశం ఉందని స్థానిక పోలీసులు భావిస్తున్నారు. వారితో పాటు టెక్నీషియన్స్ కూడా రానున్నారు. అయితే డైరెక్టర్ సుకుమార్ మాత్రం పాట్నాలో జరగబోయే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఈ మూవీ పెండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలా ఉన్నాయంట. వాటిని పూర్తి చేయడం పై సుకుమార్ పూర్తిగా ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాట్నాలో జరగబోయే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లడం లేదని అనుకుంటున్నారు. వీటితో పాటు మిగిలిన ప్రమోషనల్ ఈవెంట్స్ లలో చాలా వాటికి సుకుమార్ హాజరుకాకపోవచ్చనే టాక్ నడుస్తోంది. ‘పుష్ప’ తరహాలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా రిలీజ్ కి ముందు సుకుమార్ కనిపించొచ్చని ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
-
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
-
Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో ‘జీ5’ సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
-
Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!