Puri Jagannath Ratna Bhanda: పూరీ జగన్నాథుడి ‘రత్న గర్భం’ గుట్టు వీడనుంది.. 48 ఏళ్ల తర్వాత తెరుచుకున్న నిధుల గది!
- చివరిసారిగా 1978లో జరిగిన ఆభరణాల లెక్కింపు
- బుధవారం శుభ ముహూర్తంలో ప్రారంభమైన లెక్కింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannath Ratna Bhanda: ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రత్న భండార్’ (ఆభరణాల గది) రహస్యం త్వరలోనే వీడనుంది. సుమారు 48 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రత్న భండారంలోని అమూల్యమైన బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాల లెక్కింపు ప్రక్రియ బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం 12:09 గంటల నుంచి 1:40 గంటల మధ్య ఉన్న అత్యంత శుభ ముహూర్తంలో ఈ ప్రక్రియను చేపట్టారు. ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ, అధికారులు, నియమించబడిన సిబ్బంది సమక్షంలో ఆభరణాల జాబితాను సిద్ధం చేసే పని మొదలైంది. అంతకుముందు 11:30 గంటల ప్రాంతంలోనే సిబ్బంది సాంప్రదాయక దుస్తులైన ధోవతి, ఉత్తరీయం ధరించి ఆలయంలోకి ప్రవేశించారు.
READ ALSO: Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్కు స్పెషల్ ట్రీట్!
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
48 ఏళ్ల తర్వాత రత్న గర్భం వెలుగులోకి..
చివరిసారిగా 1978లో ఈ రత్న భండారంలోని ఆభరణాల లెక్కింపు జరిగింది. ఆ సమయంలో రికార్డుల ప్రకారం.. 128 కిలోల బంగారు ఆభరణాలు, 221 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ లెక్కింపు జరుగుతుండటంతో, ప్రస్తుతం అక్కడ ఎంత సంపద ఉందనేది యావత్ దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన విభాగం (SJTA) ఈ ప్రక్రియను అత్యంత గోప్యంగా, భద్రత నడుమ నిర్వహిస్తోంది. కేవలం ప్రభుత్వం గుర్తించిన, లెక్కింపు కోసం నియమించిన వ్యక్తులకు మాత్రమే లోపలికి అనుమతి కల్పించారు. లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆలయ నిబంధనల ప్రకారం సాంప్రదాయక దుస్తుల్లోనే వెళ్లాలి. పూరీ జగన్నాథుడి రత్న భండారంలో ఉండే అంతుచిక్కని నిధుల గురించి తరతరాలుగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ అధికారిక లెక్కింపు ద్వారా ఆ నిధుల అసలు విలువ, వివరాలు బయటకు రానున్న నేపథ్యంలో భక్తుల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!