Puri Jagannath Ratna Bhanda: పూరీ జగన్నాథుడి ‘రత్న గర్భం’ గుట్టు వీడనుంది.. 48 ఏళ్ల తర్వాత తెరుచుకున్న నిధుల గది!
- చివరిసారిగా 1978లో జరిగిన ఆభరణాల లెక్కింపు
- బుధవారం శుభ ముహూర్తంలో ప్రారంభమైన లెక్కింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannath Ratna Bhanda: ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రత్న భండార్’ (ఆభరణాల గది) రహస్యం త్వరలోనే వీడనుంది. సుమారు 48 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రత్న భండారంలోని అమూల్యమైన బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాల లెక్కింపు ప్రక్రియ బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం 12:09 గంటల నుంచి 1:40 గంటల మధ్య ఉన్న అత్యంత శుభ ముహూర్తంలో ఈ ప్రక్రియను చేపట్టారు. ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ, అధికారులు, నియమించబడిన సిబ్బంది సమక్షంలో ఆభరణాల జాబితాను సిద్ధం చేసే పని మొదలైంది. అంతకుముందు 11:30 గంటల ప్రాంతంలోనే సిబ్బంది సాంప్రదాయక దుస్తులైన ధోవతి, ఉత్తరీయం ధరించి ఆలయంలోకి ప్రవేశించారు.
READ ALSO: Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్కు స్పెషల్ ట్రీట్!
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
48 ఏళ్ల తర్వాత రత్న గర్భం వెలుగులోకి..
చివరిసారిగా 1978లో ఈ రత్న భండారంలోని ఆభరణాల లెక్కింపు జరిగింది. ఆ సమయంలో రికార్డుల ప్రకారం.. 128 కిలోల బంగారు ఆభరణాలు, 221 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ లెక్కింపు జరుగుతుండటంతో, ప్రస్తుతం అక్కడ ఎంత సంపద ఉందనేది యావత్ దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన విభాగం (SJTA) ఈ ప్రక్రియను అత్యంత గోప్యంగా, భద్రత నడుమ నిర్వహిస్తోంది. కేవలం ప్రభుత్వం గుర్తించిన, లెక్కింపు కోసం నియమించిన వ్యక్తులకు మాత్రమే లోపలికి అనుమతి కల్పించారు. లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆలయ నిబంధనల ప్రకారం సాంప్రదాయక దుస్తుల్లోనే వెళ్లాలి. పూరీ జగన్నాథుడి రత్న భండారంలో ఉండే అంతుచిక్కని నిధుల గురించి తరతరాలుగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ అధికారిక లెక్కింపు ద్వారా ఆ నిధుల అసలు విలువ, వివరాలు బయటకు రానున్న నేపథ్యంలో భక్తుల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!