Puri Jagannadh : యుద్ధం అనివార్యం అంటున్న డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్
- మరో టాపిక్ తో వచ్చిన పూరి జగన్నాథ్
- ఎండ్ లెస్ బాటిల్ అర్థం చెప్పిన పూరి
- ఇక్కడ యుద్ధం చేయాల్సిందేనన్న డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannadh : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో సరికొత్త టాపిక్ తీసుకొచ్చాడు. టాపిక్ పేరు ‘ఎండ్ లెస్ బాటిల్’. మరి పూరి మాటల్లోనే ‘ఎండ్ లెస్ బాటిల్’ అంటే ఏంటో విందాం. పూరి మాటల్లో.. ‘అనంత మహాసముద్రం.. అరుస్తున్న కెరటాలు.. అదుపు తప్పిపోయిన గాలులు.. అలలపై కలల మధ్య గుంపులుగా చేరిన జనం. ఎలాగూ పోతాం.. తప్పించుకునేందుకు మరో దారేలేదు. అందుకే పోయే ముందు బతుకుదాం. అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం, అర్థం పరమార్థం ఏంటో తేల్చేద్దాం. ఇంకా నడి మధ్యనే ఉన్నాం. ఇంకెంత దూరమో ఈ ప్రయాణం. గత ప్రయాణం అదొక కథ. రేపటి ప్రయాణం మరొక కథ. పిట్ట కథలు మనకెందుకు ? ఇప్పుడే ఇక్కడే తాపీగా బతికేద్దాం. మళ్లీ మబ్బులు.. చంపుకుని తినే చినుకులు. ఇది వానో పెను తుపానో! పడవలోకి నీరొస్తే.. పరదా చిరిగిపోతే.. భయపడేదేలే. వలలో ఒక్క చేపా చిక్కలే.. అయితేనేం ? పస్తులుందాం.. ఫర్వాలేదు. ఇవాళ ఆకలితో కడుపు మాడితే.. రేపటి వేట తీరు వేరేలా ఉంటుంది.
Read Also:PM Modi: నేడు రోజ్గార్ మేళా.. 71 వేల మందికి నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ
Also Read
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
సొర చేపలు చిక్కకపోతాయా? ఏదీ నేర్చుకోకుండా ఏ రోజూ ఉండకు. ఎండకుండా.. వేటాడకుండా నిద్రలోకి జారుకోకు. ఏంటో ఎగిరెగిరి పడుతోంది పడవ. చలిగాలి ఒక పక్క.. చల్లటి జల్లు మరో పక్క. తడిసిన ఒళ్లు.. పెదాలపై ఉప్పు నీళ్లు. ఒళ్లంతా వణుకు.. కళ్లల్లో బెణుకు. ఎముకల్లో ఆవహించిన నిస్సత్తువ. అయినా నా అన్న వారిని వదులుకోకునే ప్రసక్తే లేదు. సాయం చేసిన చేతిని ఎప్పటికీ మరవకు. పిడుగొచ్చి మీద పడినా కెరటం ఢీ కొట్టినా ఆ చేయిని వదలకు. తమ్ముడా.. ఇక్కడ అందరిది ఒకే పడవలో ప్రయాణం. అదిగో పొగరెక్కిన తరంగం. ఉప్పొంగిన హిమాలయం. ప్రతి కెరటం.. ముంచాలనే, ఆదమరిస్తే చంపాలనే. ఆపకు తమ్ముడూ తెడ్డు వేయడం మానకు. ఎదురెళ్లి ఎక్కేసి దూకేయ్. ఈ అనంత కడలిలో మనమెంత? పడవెంత? ఇసుకెంత? అయినా.. సంద్రాన్ని చీల్చుకుంటూ పోదాం. కొడవళ్లై కోసుకుంటూ పోదాం. అమ్మ వద్దన్నా, దేవుడు అడ్డుపడినా పులులై దూకేద్దాం, సింహాలై గర్జిద్దాం. తనతో తానే తలపడితే గౌతమ బుద్ధ సిద్ధార్థ. తలలు నరుకుతావో తలే నరుక్కుంటావో! తమ్ముడా.. ఇక్కడ యుద్ధం అనివార్యం’’ అంటూ ఆయన ముగించారు.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!