Farmers Compensation: రైతులకు గుడ్ న్యూస్.. వర్షం కారణంగా పంట నష్టపోయిన వారికి రూ.86కోట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Compensation: ఈ ఏడాది దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి పంజాబ్లో వరుణుడు భారీ వర్షం కురిపించాడు. దీంతో పలు జిల్లాల్లో వరద బీభత్సం నెలకొంది. నగరాలు కూడా జలమయమయ్యాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. విశేషమేమిటంటే పంజాబ్లో అధిక వర్షాల కారణంగా చాలా మంది రైతులు నష్టపోయారు. లక్షల హెక్టార్లలో సాగు చేసిన వరి పంట నాశనమైంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు మళ్లీ వరి నాట్లు వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పంట నష్టపోయిన రైతులకు పంజాబ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రైతులకు ఎకరాకు రూ.6,800 చొప్పున నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి హేమంత్ మాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం 86 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసింది. త్వరలోనే పరిహారం సొమ్ము రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. అయితే జూలై నెలలో ప్రభుత్వం రైతుల ఖాతాలో రూ.103 కోట్లు పరిహారంగా విడుదల చేసింది.
Also Read
- CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
- Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..
- India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
Read Also:Gold Today Price: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
జూలై నెలలో పంజాబ్ సగటు కంటే 44 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పంజాబ్లోని ఫరీద్కోట్లో 256.2 మి.మీ, మొహాలీలో 472.6 మి.మీ ఎక్కువ వర్షం కురిసింది. అదేవిధంగా పాటియాలాలో 71 శాతం, రూప్నగర్లో 107 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కాగా, జూలై నెలలో టార్న్ తరణ్లో 151 శాతం, జలంధర్లో 34 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి. దీంతో ఈ జిల్లాల్లో 6.25 లక్షల ఎకరాల్లో వేసిన కొత్త పంట నీటమునిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు 2.75 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి వచ్చింది.
రబీ సీజన్లో కూడా అకాల వర్షాలు పంజాబ్లో భారీ వినాశనానికి కారణమయ్యాయి. ఆపై వర్షం, వడగళ్ల వాన కారణంగా వేలాది హెక్టార్లలో వేసిన గోధుమ పంట నాశనమైంది. పంట నష్టపోయిన రైతులకు బదులు పరిహారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ రైతులకు ఇంకా ఎలాంటి సాయం అందలేదు.
Read Also:Food Inflation: తక్కువ వర్షపాతం నమోదు కారణంగా పెరగనున్న ద్రవ్యోల్బణం
తాజావార్తలు
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
-
Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..
-
Vishwak Sen: మాస్ కా దాస్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఆ డైరెక్టర్తో విశ్వక్ మూవీ!
-
India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!