Farmers Compensation: రైతులకు గుడ్ న్యూస్.. వర్షం కారణంగా పంట నష్టపోయిన వారికి రూ.86కోట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Compensation: ఈ ఏడాది దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి పంజాబ్లో వరుణుడు భారీ వర్షం కురిపించాడు. దీంతో పలు జిల్లాల్లో వరద బీభత్సం నెలకొంది. నగరాలు కూడా జలమయమయ్యాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. విశేషమేమిటంటే పంజాబ్లో అధిక వర్షాల కారణంగా చాలా మంది రైతులు నష్టపోయారు. లక్షల హెక్టార్లలో సాగు చేసిన వరి పంట నాశనమైంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు మళ్లీ వరి నాట్లు వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పంట నష్టపోయిన రైతులకు పంజాబ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రైతులకు ఎకరాకు రూ.6,800 చొప్పున నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి హేమంత్ మాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం 86 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసింది. త్వరలోనే పరిహారం సొమ్ము రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. అయితే జూలై నెలలో ప్రభుత్వం రైతుల ఖాతాలో రూ.103 కోట్లు పరిహారంగా విడుదల చేసింది.
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
Read Also:Gold Today Price: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
జూలై నెలలో పంజాబ్ సగటు కంటే 44 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పంజాబ్లోని ఫరీద్కోట్లో 256.2 మి.మీ, మొహాలీలో 472.6 మి.మీ ఎక్కువ వర్షం కురిసింది. అదేవిధంగా పాటియాలాలో 71 శాతం, రూప్నగర్లో 107 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కాగా, జూలై నెలలో టార్న్ తరణ్లో 151 శాతం, జలంధర్లో 34 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి. దీంతో ఈ జిల్లాల్లో 6.25 లక్షల ఎకరాల్లో వేసిన కొత్త పంట నీటమునిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు 2.75 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి వచ్చింది.
రబీ సీజన్లో కూడా అకాల వర్షాలు పంజాబ్లో భారీ వినాశనానికి కారణమయ్యాయి. ఆపై వర్షం, వడగళ్ల వాన కారణంగా వేలాది హెక్టార్లలో వేసిన గోధుమ పంట నాశనమైంది. పంట నష్టపోయిన రైతులకు బదులు పరిహారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ రైతులకు ఇంకా ఎలాంటి సాయం అందలేదు.
Read Also:Food Inflation: తక్కువ వర్షపాతం నమోదు కారణంగా పెరగనున్న ద్రవ్యోల్బణం
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?