Ambati Rambabu: “దొంగ ఓట్లు వేసిన వాళ్ళ పేర్లతో సహా”.. ఉప ఎన్నికలపై అంబటి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former minister Ambati Rambabu alleges: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఎప్పుడూ జరగనంత ఘోరంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 2017లో నంద్యాల కంటే దారుణంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేస్తున్నారని.. దొంగ ఓట్లు వేసిన వాళ్ళ పేర్లతో సహా మా నేతలు వివరాలు తెలిపారన్నారు.. పోలీస్ యంత్రాంగం వైసీపీ నేతలను బూతుల దగ్గరకు రాకుండా అడ్డుకున్నారు.. మా పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఇష్టానుసారం తిప్పారని మండిపడ్డారు.. ఇవాళ ఖాకీ దుస్తులు వేసుకున్న సంగతి మర్చిపోయి టీడీపీ ఏజెంట్ లా ఎన్నిక జరిపే కార్యక్రమం డీఐజీ కోయా ప్రవీణ్ చేపట్టారని ఆరోపించారు. ఇంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా..? అని ప్రశ్నించారు.
READ MORE: Indus Waters Treaty: భారత్కు పాక్ వార్నింగ్.. సింధూ జలాల కోసం చిల్లర హెచ్చరికలు!
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
పోలీసులు దొంగ ఓట్లు వేసే వాళ్లను అడ్డుకోకుండా వీళ్ళే తీసుకువెళ్లి వేయిస్తున్నారు.. పులివెందుల వైసీపీ కార్యాలయంలో అవినాష్ రెడ్డి కూర్చుంటే స్వయంగా డీఐజీ వెళ్ళారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. మరో డీఎస్పీ నానా దుర్భాషాలు ఆడారని.. కార్యాలయం బయట ఉన్న జనాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.. మీరు ఖాకీలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకుని తిరిగితే బాగుంటుంది.. నేను రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటి రాజకీయాలు చూడలేదని విమర్శించారు.. మీరు తీసుకువచ్చిన సంస్కృతి మిమ్మల్ని, మీ కొడుకును వెంటాడదా..? అని నిలదీశారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.. మీకు ఓటేసిన వాళ్లకు చంద్రబాబు ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా..? అన్నారు.
పోలీసులే ఎన్నికలు చేసే దుష్ట సంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు.
“సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళు విచ్చలవిడిగా పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు చేసుకునేందుకు అవినాష్ రెడ్డిని అడ్డుకుంటున్నారు.. చంద్రబాబు దగ్గర శెభాష్ అనిపించుకునే ప్రయత్నం చేస్తున్న డీఐజీ కోయా ప్రవీణ్.. దీనికి తప్పనీ సరిగా మూల్యం చెల్లించుకోకతప్పదు.. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంటే మా ఓటు మాకు ఇప్పించండి అని జనం ఎందుకు పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నారు.. మహిళలు తమ ఓట్ల కోసం ధర్నాలు చేస్తున్నారు.. అక్కడేం జరుగుతుందో రాష్ట్రం మొత్తం చూస్తున్నారు.. జమ్మలమడుగు వైస్ చైర్మన్ వచ్చి దొంగ ఓట్లు వేసి వెళ్ళారు.. వైసీపీ కార్యకర్తలు బయటకు రాకుండా చేసి పోలీసుల సమక్షంలోనే దొంగ ఓట్లు వేసుకున్నారు..” అని మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!