Rice : బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice : మనది వ్యవసాయ ఆధారిత దేశం. మన నిత్యావసర వస్తువులలో ప్రధానమైనది బియ్యం. అన్నం తినకుండే మనకు రోజు గడవదు. మనం ఎంత కష్ట పడిన జానెడు పొట్టకోసమే. చాలామంది బియ్యాన్ని రెండు, మూడు నెలకు సరిపడేలా లేదా ఆరు నెలలకు సరిపడా కొనుగోలుచేసి నిల్వ చేసుకుంటుంటారు. ఇలా నిల్వ చేసుకోవడం మంచిదే. కానీ ఇలా నిల్వ చేసుకోవడం వల్ల బియ్యంలో పురుగులు పడతాయి. ఈ పురుగులు విసర్జంచే వ్యర్థాలు, మలినాలు బియ్యానికి పడతాయి. ఇలాంటి బియ్యాన్ని వండుకుని తింటే లేనిపోని రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కనుక మనం బియ్యంలో పురుగులు పడకుండా నిల్వ చేసుకోవాలి.
మార్కెట్ లో బియ్యానికి పురుగు పట్టకుండా చేసే పౌడర్ లు దొరుకుతుంటాయి. ఈ పౌడర్ ను బియ్యంలో కలపడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. కానీ ఇలా రసాయనాలు కలిగిన పౌడర్ ను వాడడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటిలోనే చిన్న చిట్కాలను ఉపయోగించి మనం బియ్యం పురుగు పట్టకుండా చేయవచ్చు. పురుగు పట్టిన బియ్యాన్ని శుభ్రం చేయడం చాలా కష్టం. బియ్యం నుండి ఒక్కో పురుగును తీయడం చాలా కష్టం. వీటిని శుభ్రం చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. బియ్యం పురుగు పట్టాక శుభ్రం చేయడం కంటే పురుగు పట్టకుండా ముందుగానే జాగ్రత్త పడడం మంచిది.
Also Read
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
Read Also:Telangana: ఏం కొడుకులు రా నాయనా..? తల్లిని గెంటేసి ఇంటికి తాళం..
బియ్యం పురుగుపట్టడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో తేమ కూడా ఒకటి. బియ్యం నిల్వ చేసిన ప్రదేశం చుట్టూ లేదా ఆ ప్రదేశంలో తేమ ఉండడం వల్ల బియ్యం పురుగు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక బియ్యాన్ని నిల్వ చేసే ప్రదేశం చుట్టూ తేమ లేకుండా చూసుకోవాలి. ఇంగువను ఉపయోగించి కూడా మనం బియ్యం పురుగు పట్టకుండా చేయవచ్చు. దీని ఘాటైన వాసన కారణంగా బియ్యానికి పురుగులు రాకుండా ఉంటాయి. ఇంగువ పొడిని చిన్న మూటలుగా కట్టి బియ్యంలో అక్కడక్కడ ఉంచాలి. ఇలా చేయడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది.
కర్ఫూరాన్ని కూడా ఇదే విధంగా మూటలుగా కట్టి బియ్యంలో ఉంచడం వల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి. బియ్యం పురుగు పట్టకుండా చేయడంలో వేపాకు ఎంతో సహాయపడుతుంది. బియ్యాన్ని నిల్వ చేసుకునే డబ్బా అడుగు భాగాన వేపాకును ఉంచి ఈ వేపాకుపై బియ్యాన్ని పోయాలి లేదా వేప చెట్టు ఆకుల పొడిని మూటలుగా కట్టి బియ్యంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది.
Read Also:Tea plantations: టీ తోటలను కాపాడేందుకు ఇంత కష్టపడ్డారా?
వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి బియ్యంలో ఉంచడం వల్ల బియ్యం పురుగు రాదు. బియ్యం పురుగుపట్టకుండా చేయడంలో లవంగాలు సమర్థవంతంగా పని చేస్తాయి. బియ్యంలో లవంగాలను ఉంచడం వల్ల లేదా లవంగాల పొడిని వస్త్రంలో కట్టి బియ్యంలో ఉంచడం వల్ల కూడా పురుగు పట్టకుండా ఉంటుంది.
ఒక వస్త్రంలో గుప్పెడు ఉప్పును ఉంచి మూటగా కట్టి బియ్యంలో ఉంచడం వల్ల పురుగులు రావు. ఇలా పురుగులు పట్టిన బియ్యంలో ఉంచినా కూడా పురుగులు తొలగిపోతాయి. ఎండబెట్టిన కాకరకాయ ముక్కలను లేదా వాటి పొడిని మూటగా కట్టి బియ్యంలో ఉంచడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ విధంగా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం బియ్యానికి పురుగు పట్టకుండా చేయవచ్చు.
తాజావార్తలు
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
-
DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!