కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కుమారుడు రైహాన్ వాద్రా(25).. తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీకి చెందిన అవివా బేగ్తో ఏడేళ్ల నుంచి రైహాన్ వాద్రా మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇటీవల అవివా బేగ్కు పెళ్లి ప్రపోజ్ చేయగా ఆమె ఓకే చెప్పింది. దీంతో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి.