టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి జరిగింది. షాతో పాటు అతడి స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్పై ముంబైలోని శాంటా క్రూజ్ ఫైవ్ స్టార్ హోటల్ ఆవరణలో పలువురు దుండగులు దాడి చేశారు. షా ప్రయాణిస్తున్న కారును బేస్బాల్ బ్యాట్లతో ధ్వంసం చేశారు. ఈ ఘటనపై షా స్నేహితుడు సురేంద్ర ఓషివరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఏం జరిగిందంటే!
ఫిబ్రవరి 15న పృథ్వీ షా.. సురేంద్ర యాదవ్తో పాటు పలువురు స్నేహితులతో కలిసి ముంబైలోని శాంటా క్రూజ్ హోటల్లో డిన్నర్ చేసేందుకు వెళ్లాడు. షా హోటల్ దగ్గరకు వెళ్లగానే నిందితుల్లో ఇద్దరు వచ్చి సెల్ఫీలు ఆడగ్గా షా వారితో కలిసి ఫోటోలు దిగి హోటల్లోనికి ప్రవేశించేందుకు ముందుకు కదిలాడు. ఈలోపు మరో ఇద్దరు వచ్చి సెల్ఫీ దిగాలని షాపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు షా ఒప్పుకోకపోవడంతో వారు అతన్ని అడ్డుకున్నారు. ఈలోపు పక్కనే ఉన్న షా స్నేహితుడు హోటల్ మేనేజ్మెంట్కు ఫోన్ చేసి జరుగుతున్న విషయాన్ని వివరించగా.. వారు నిందితులను హోటల్ బయటకు గెంటేశారు. దీంతో కోపంతో నిందితులు హోటల్ బయట కాపు కాచి షా ప్రయాణిస్తున బీఎండబ్ల్యూ కారుపై బేస్బాల్ బ్యాట్లతో దాడికి దిగారు. వెంటనే అలర్ట్ అయిన షా స్నేహితుడు.. అతన్ని మరో కారులోకి తరలించాడు. అయినప్పటికీ వదలని నిందితులు షా ప్రయాణిస్తున్న కారును ఛేజ్ చేసి లోటస్ పెట్రోల్ బంకు వద్ద మరోసారి అడ్డుకుని దాడిచేశారు. షా కారు వద్దకు ఓ యువతిని పంపిన నిందితులు యాభై వేల నగదు ఇస్తే విషయాన్ని ఇక్కడితో వదిలేస్తామని.. లేకపోతే కేసులు పెడతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న షా నేరుగా ఓషివరా పీఎస్కు చేరుకున్నాడు.
కాగా, ఇటీవలి కాలంలో దేశవాలీ టోర్నీల్లో పరగుల వరద పారించిన షా.. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. వాస్తవానికి షా టీ20ల్లో కాకుండా టెస్టుల్లో స్థానం దక్కుతుందని అశించాడు. అరంగేట్రం టెస్ట్లోనే సెంచరీ చేసి సత్తా చాటిన షా.. ఆ తర్వాత కొన్ని టెస్ట్లకే ఫామ్ కోల్పోయి ఉద్వాసన గురయ్యాడు.
Also Read: Vivo Y100: కలర్ ఛేంజింగ్ ప్యానెల్తో వివో కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవే!