Modi-Neeraj Chopra: ‘మరోసారి దేశం గర్వపడేలా చేశావు..’ నీరజ్ చోప్రాతో ఫోన్లో ప్రధాని
- పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా
- నీరజ్ చోప్రాతో శుక్రవారం ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ
- నీరజ్ చోప్రాను అభినందించిన ప్రధాని
- నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని ప్రశంసించిన మోడీ.
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని మోడీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. అంతేకాకుండా.. నీరజ్ చోప్రాను అభినందించారు.. అతని గాయం గురించి అప్డేట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా.. నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని కూడా ప్రధాని ప్రశంసించారు.
Read Also: Michelle poonawalla: ముంబైలో రూ.500 కోట్లతో ఇల్లు కొనుగోలు చేసిన బిలియనీర్ దంపతులు
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ప్రధాన మంత్రి ఫోన్ కాల్లో నీరజ్ చోప్రాతో మాట్లాడుతూ.. “మరోసారి దేశం గర్వపడేలా చేసావు. రాత్రి ఒంటి గంట సమయంలో కూడా ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజలు మీ ఆటను చూశారు,” అని మోడీ కొనియాడారు. ఫిట్నెస్ సమస్యలు ఉన్నప్పటికీ.. నిలకడగా ప్రదర్శన చేయడం అభినందనీయమన్నారు. గాయాల కారణంగా బంగారు పతకం సాధించలేదని నీరజ్ వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితుల్లోనూ దేశానికి పతకం సాధించడం సంతోషంగా ఉందని, క్రీడల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని ప్రధాని మోడీ అన్నారు. భవిష్యత్ లో మరింత శ్రమిస్తానని నీరజ్ చోప్రా తెలిపాడు.
Read Also: AMGEN: హైదరాబాద్లో మరో అతి పెద్ద కంపెనీ.. వేలల్లో ఉద్యోగావకాశాలు
స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో పతకం సాధించగలిగాడు. స్వతంత్ర భారతంలో ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్గా నిలిచాడు. తన అత్యుత్తమ ప్రదర్శనతో 89.45 మీటర్లతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయుడు నీరజ్. కాగా.. తాజాగా జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్లో అర్షద్ 92 మీటర్ల మార్క్ను తాకగా.. నీరజ్ 89.45 మీటర్లు విసిరాడు. కాగా.. టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా పసిడి పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో