PM MODI: కాశీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. అక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ కార్యదర్శి జై షా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. చంద్రుడు శివశక్తి పాయింట్కి భారతదేశం చేరుకోవడానికి ఒక నెల పూర్తైన ఈ రోజున కాశీకి వచ్చానని అన్నారు. గత నెల 23న చంద్రయాన్ ల్యాండ్ అయిన చంద్రుని బిందువు శివశక్తి అని అన్నారు. చంద్రునిపై ఒక శివశక్తి ఉంటే.. మరొకటి కాశీలో ఉందని చెప్పారు. ఈ రోజు శివశక్తి స్థానం నుండి భారతదేశం విజయం సాధించినందుకు మరోసారి అభినందిస్తున్నానని తెలిపారు.
Mahanandi: మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం
Also Read
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వారణాసి, పూర్వాంచల్ యువతకు కాశీలో నిర్మించబోయే స్టేడియం వరంగా మారనుందన్నారు. ఈ స్టేడియం సిద్ధమైతే 30 వేల మందికి పైగా ఇక్కడ మ్యాచ్ను చూడవచ్చని తెలిపారు. ఈ స్టేడియంలో ఎన్నో గొప్ప క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయని ప్రధాని మోడీ అన్నారు. అంతేకాకుండా.. స్థానిక క్రీడాకారులు ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీని వల్ల కాశీ ఎంతో ప్రయోజనం పొందుతుందని చెప్పారు. నేడు ప్రపంచం క్రికెట్తో ముడిపడి ఉందని.. రాబోయే రోజుల్లో సహజంగానే క్రికెట్ మ్యాచ్ల సంఖ్య కూడా పెరుగుతుందని అన్నారు.
R.Krishnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసిన ఆర్.కృష్ణయ్య..
ఈ స్టేడియం స్థలం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.121 కోట్లు వెచ్చించింది. స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ మొత్తం రూ.330 కోట్లు వెచ్చించనుంది. ఈ స్టేడియం ద్వారా తొలిసారిగా వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. వారణాసిలోని రాజతలాబ్లోని గంజరిలో ఈ స్టేడియంను నిర్మించనున్నారు. దీని తయారీకి మొత్తం రూ.450 కోట్లు వెచ్చించనున్నారు. ఈ స్టేడియం 30 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది.
Heavy Rains: నాగ్పూర్లో భారీ వర్షం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత
వారణాసిలో నిర్మిస్తున్న ఈ స్టేడియం ప్రత్యేకత దాని నిర్మాణంలో దాగి ఉంది. దీని వాస్తుశిల్పం శివునిచే ప్రేరణ పొందింది. ఇది చంద్రవంక ఆకారపు పైకప్పు కవర్, త్రిశూలం ఆకారంలో ఫ్లడ్-లైట్లను కలిగి ఉంటుంది. సీటింగ్ ఏర్పాటు ఘాట్లా ఉంటుంది. ఇక స్టేడియం కెపాసిటీ గురించి మాట్లాడితే.. 30 వేల మంది ఇక్కడ కూర్చుని మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2025 నాటికి ఈ స్టేడియం సిద్ధం కానుంది. కాన్పూర్, లక్నో తర్వాత యూపీలో ఇది మూడో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా అవతరించనుంది.
తాజావార్తలు
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!