Sudha Murthy: ఉమెన్స్ డే రోజున సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudha Murthy: ప్రముఖ విద్యావేత్త సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసారు. ప్రెసిడెంట్ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఉమెన్స్ డే రోజున ఈ ప్రకటన వెలువడడం విశేషం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుధా మూర్తిని రాజ్యసభకు నామినేట్ చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు, ఇది మన నారీ శక్తికి శక్తివంతమైన నిదర్శనమని అభివర్ణించారు.
Read Also: Women’s Day Special: మహిళల గొప్పతనాన్ని వివరించే పాటలు ఏంటో తెలుసా?
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
“భారత రాష్ట్రపతి సుధా మూర్తి జీని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనది, స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభలో ఉండటం మన ‘నారీ శక్తి’కి ఒక శక్తివంతమైన నిదర్శనం, ఇది మన దేశం విధిని రూపొందించడంలో మహిళల శక్తి, సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుంది. ఆమె ఫలవంతమైన పార్లమెంటరీ పదవీకాలం కావాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు.
I am delighted that the President of India has nominated @SmtSudhaMurty Ji to the Rajya Sabha. Sudha Ji's contributions to diverse fields including social work, philanthropy and education have been immense and inspiring. Her presence in the Rajya Sabha is a powerful testament to… pic.twitter.com/lL2b0nVZ8F
— Narendra Modi (@narendramodi) March 8, 2024
ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి.. గొప్ప రచయిత, దాతృత్వాన్ని నమ్ముతారు. ఆమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను ప్రారంభించారు. సుధామూర్తి భర్త నారాయణమూర్తి ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు. సుధామూర్తి ఎంతో సామాజిక సేవ చేశారు. ఆమె చేసిన సేవకు గానూ 2006లో దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. 2023లో 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది.
సుధా మూర్తి 19 ఆగస్టు 1951న కర్ణాటకలోని షిగ్గావ్లో జన్మించారు. ఆమె కన్నడ మాట్లాడే దేశస్థ మాధవ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. సుధా మూర్తి బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.తన చదువు పూర్తయిన తర్వాత, సుధా మూర్తి భారతదేశంలోని అతిపెద్ద ఆటో తయారీదారు టాటా ఇంజనీరింగ్, లోకోమోటివ్ కంపెనీలో పని చేయడం ప్రారంభించారు. ఆమె ఆ సమయంలో మొదటి మహిళా ఇంజనీర్ కావడం విశేషం. ఆ తర్వాత ఆమె పుణేలో డెవలప్మెంట్ ఇంజనీర్గా కంపెనీలో చేరారు.
1996లో సుధా మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను ప్రారంభించారు. ఈ రోజు వరకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీగా, బెంగుళూరు విశ్వవిద్యాలయంలోని పీజీ సెంటర్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆమె క్రైస్ట్ యూనివర్సిటీలో కూడా బోధించారు. ఆమె గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య సంరక్షణ కార్యక్రమాలలో సభ్యురాలు. ఆమె అనేక అనాథాశ్రమాలను స్థాపించింది, గ్రామీణాభివృద్ధి ప్రయత్నాలలో పాల్గొన్నారు. అన్ని కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్, లైబ్రరీ సౌకర్యాలను అందించాలనే ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సుధామూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. సుధా మూర్తి, నారాయణ మూర్తికి ఇద్దరు పిల్లలు, అక్షతా మూర్తి, రోహన్ మూర్తి. అక్షతా మూర్తి బ్రిటిష్ ప్రధాన మంత్రి, రిషి సునాక్ను వివాహం చేసుకున్నారు. సుధా మూర్తి నవలలు, నాన్-ఫిక్షన్, ట్రావెలాగ్స్, టెక్నాలజీ ఆధారిత పుస్తకాలు, జ్ఞాపకాలు వంటి అనేక పుస్తకాలను రాశారు. ఆమె రాసిన అన్ని పుస్తకాలను ప్రధాన భారతీయ భాషలలోకి అనువదించారు. అంతేకాదు ఇంగ్లీష్, కన్నడ వార్తాపత్రికలకు కాలమిస్ట్గా కూడా పనిచేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!