PM Modi: మోడీ స్వయంగా స్వాగతించిన విదేశీ అతిథులు వీరే..
- ప్రోటోకాల్ బ్రేక్ చేసి పుతిన్ను రిసీవ్ చేసుకున్న మోడీ..
- ఆరుగురు దేశాధినేతలను స్వయంగా స్వాగతించిన ప్రధాని..
PM Modi: రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్టుకు వెళ్లి పుతిన్ను ఘనంగా స్వాగతించారు. ప్రధాని మోడీ కొంత మంది విదేశీ అతిథుల కోసం మాత్రమే ఇలా ప్రోటోకాల్ను పక్కన పెట్టి, స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. తాజాగా పుతిన్ విషయంలో మోడీ చర్య భారత, రష్యా బంధాన్ని గుర్తు చేస్తోంది. ప్రధాని మోడీ తన 11 ఏళ్ల పాలనలో పుతిన్తో సహా ఇప్పటి వరకు ఏడుగురు విదేశీ అతిథులను మాత్రమే ఇలా అరుదుగా స్వాగతించారు.
బరాక్ ఒబామా, 2015:
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
మోడీ తాను ప్రధానిగా ఎన్నికైన ఏడాదిలోనే భారత్కు రిపబ్లిక్ డే గెస్ట్గా వచ్చిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించారు. రెండు దేశాల మధ్య మధ్య బిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదిరాయి.
షేక్ హసీనా, 2017:
ఏప్రిల్ 2017లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను కూడా ఇలాగే స్వయంగా స్వాగతించారు. ప్రస్తుతం, షేక్ హసీనా భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు. గతేడాది బంగ్లాదేశ్ హింసాత్మక ఆందోళన కారణంగా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చారు.
షింజో అబే, 2017:
జపాన్, భారత సంబంధాల్లో కొత్త అధ్యాయానికి కారణమైన అప్పటి జపాన్ ప్రధాని షింజో అబేను అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి మోడీ రిసీవ్ చేసుకున్నారు. షింజో అబే సమయంలో భారత్, జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి.
డోనాల్డ్ ట్రంప్, 2020:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి పరిపాలన కాలంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు, మోడీ ఆయనను అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు.
మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 2024:
గతేడాది జనవరిలో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనడానికి వచ్చిన యూఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను భారత ప్రధాని మోడీ స్వాగతించారు.
అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ 2025:
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ విమానాశ్రయంలో ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీని స్వాగతించారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!