PM Modi: మోడీ స్వయంగా స్వాగతించిన విదేశీ అతిథులు వీరే..
- ప్రోటోకాల్ బ్రేక్ చేసి పుతిన్ను రిసీవ్ చేసుకున్న మోడీ..
- ఆరుగురు దేశాధినేతలను స్వయంగా స్వాగతించిన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్టుకు వెళ్లి పుతిన్ను ఘనంగా స్వాగతించారు. ప్రధాని మోడీ కొంత మంది విదేశీ అతిథుల కోసం మాత్రమే ఇలా ప్రోటోకాల్ను పక్కన పెట్టి, స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. తాజాగా పుతిన్ విషయంలో మోడీ చర్య భారత, రష్యా బంధాన్ని గుర్తు చేస్తోంది. ప్రధాని మోడీ తన 11 ఏళ్ల పాలనలో పుతిన్తో సహా ఇప్పటి వరకు ఏడుగురు విదేశీ అతిథులను మాత్రమే ఇలా అరుదుగా స్వాగతించారు.
బరాక్ ఒబామా, 2015:
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
మోడీ తాను ప్రధానిగా ఎన్నికైన ఏడాదిలోనే భారత్కు రిపబ్లిక్ డే గెస్ట్గా వచ్చిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించారు. రెండు దేశాల మధ్య మధ్య బిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదిరాయి.
షేక్ హసీనా, 2017:
ఏప్రిల్ 2017లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను కూడా ఇలాగే స్వయంగా స్వాగతించారు. ప్రస్తుతం, షేక్ హసీనా భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు. గతేడాది బంగ్లాదేశ్ హింసాత్మక ఆందోళన కారణంగా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చారు.
షింజో అబే, 2017:
జపాన్, భారత సంబంధాల్లో కొత్త అధ్యాయానికి కారణమైన అప్పటి జపాన్ ప్రధాని షింజో అబేను అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి మోడీ రిసీవ్ చేసుకున్నారు. షింజో అబే సమయంలో భారత్, జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి.
డోనాల్డ్ ట్రంప్, 2020:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి పరిపాలన కాలంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు, మోడీ ఆయనను అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు.
మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 2024:
గతేడాది జనవరిలో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనడానికి వచ్చిన యూఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను భారత ప్రధాని మోడీ స్వాగతించారు.
అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ 2025:
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ విమానాశ్రయంలో ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీని స్వాగతించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!