T20 World Cup 24: రాహుల్, గిల్లకు నో ప్లేస్.. కీపర్గా సంజూ! భారత జట్టు ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Squad for T20 World Cup 24: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 మరో నెలరోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు మే 1ని ఐసీసీ డెడ్లైన్గా విధించింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలెక్షన్ కమిటీ జట్టు ఎంపికపై కసరత్తులు ప్రారంభించింది. ఇటీవలే సెలెక్షన్ కమిటీ ఢిల్లీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో సమావేశమై జట్టు ఎంపికపై చర్చలు చేసింది. వచ్చే కొన్ని గంటల్లో ఎప్పుడైనా బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును వెల్లడించనుంది.
ఇప్పటికే మాజీలు టీ20 ప్రపంచకప్ 2024లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. అయితే ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో తమ కథనంలో మెగా టోర్నీ గురించి కీలక సమాచారం పేర్కొంది. టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికలో ఐపీఎల్ 2024 ఫామ్ను కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నారట. టాపార్డర్ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లను ఎంపిక చేసినట్లు సమాచారం. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు చోటు దక్కలేదట.
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, తెలుగు తేజం తిలక్ వర్మకు బీసీసీఐ సెలెక్టర్లు మొండి చెయ్యి చూపించినట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, రిషబ్ పంత్ను ఎంపిక చేశారట. అయితే ఫస్ట్ ఛాయిస్ కీపర్గా సంజూను పరిగణించనున్నారని తెలుస్తోంది. స్పెషలిస్ట్ ఫినిషర్గా రింకూ సింగ్ ఎంపికైనట్లు సమాచారం. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబేలు జట్టులో ఉంటారట. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేసిన బీసీసీఐ సెలెక్టర్లు.. యుజ్వేంద్ర చహల్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ పేసర్లుగా ఎంపిక కాగా.. మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్లకు సైతం అవకాశం దక్కనుందట.
భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!