Prashanth Kishore : తన భార్యను బహిరంగంగా మొదటి సారి పరిచయం చేసిన ప్రశాంత్ కిషోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Kishore : ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న పార్టీ శ్రేణుల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ ఆదివారం పాట్నాలో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ మహిళల సదసులో అతను తన భార్య జాన్వీ దాస్ను మొదటిసారి బహిరంగంగా పరిచయం చేశాడు. ప్రశాంత్ కిషోర్ దాదాపు రెండు సంవత్సరాలుగా బీహార్ పర్యటనలో ఉన్నారు.
తన భార్యను పరిచయం చేస్తూ.. ‘డాక్టరేట్ విడిచిపెట్టిన తరువాత, మొత్తం కుటుంబ బాధ్యతను తీసుకున్నారు. మీరు బీహార్లో వెళ్లి మీకు కావలసినది చేసుకోవచ్చు. కుటుంబ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. ఈ రోజు నా భార్యను మీకు మొదటిసారిగా పరిచయం చేయడానికి పిలిచాను. మా భార్య పేరు డాక్టర్ జాన్వి.’ అంటూ చెప్పుకొచ్చారు. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ తన భార్యను పరిచయం చేస్తూనే, మరోవైపు ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన కొత్త ఉద్యమంపై ఏం చెబుతారని భార్యను ప్రశ్నించగా, జాన్వీ దాస్ స్పందించారు. తనకు నా పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
Read Also:Breaking News: బైక్ పై కూతురితో వెళ్తుండగా ఎస్సైను గుద్దిన టెంపో..బాలిక మృతి
జాన్వీ దాస్ ఎవరు?
ప్రశాంత్ కిషోర్ భార్య జాన్వీ దాస్ అస్సాంలోని గౌహతి నివాసి. వృత్తిరీత్యా వైద్యురాలు. రాజకీయ వ్యూహకర్తగా మారడానికి ముందు పీకే ఐక్యరాజ్య సమితి హెల్త్ ప్రోగ్రాంలో కూడా పనిచేశాడు. పీకే, జాన్వి కలుసుకున్న సమయం ఇది. ఐక్యరాజ్య సమితి హెల్త్ ప్రోగ్రామ్లో కలిసిన తరువాత, వారి స్నేహం ప్రేమగా మారింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పీకే, జాన్వీ దాస్లకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
పీకే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు?
ప్రశాంత్ కిషోర్ 2022 అక్టోబర్ 2న బీహార్లో బహిరంగ ప్రచారాన్ని ప్రారంభించాడు. దాని కింద అతను రాష్ట్ర పర్యటనలో ఉన్నాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు క్రమంగా దగ్గరపడుతుండగా పీకే ఈ ప్రచారాన్ని రాజకీయంగా మార్చారు. అక్టోబర్ 2న ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీని ప్రారంభించనున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. 2025లో జాన్ సూరజ్ 243 స్థానాల్లో పోటీ చేస్తోందని, అందులో జాన్ సూరజ్ తరపున కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు బరిలోకి దిగుతారని అన్నారు.
Read Also:Kannappa : మంచు ఫ్యామిలీ మూడో తరం .. ఫస్ట్ లుక్ రిలీజ్..
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!