Prashanth Kishore : తన భార్యను బహిరంగంగా మొదటి సారి పరిచయం చేసిన ప్రశాంత్ కిషోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Kishore : ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న పార్టీ శ్రేణుల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ ఆదివారం పాట్నాలో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ మహిళల సదసులో అతను తన భార్య జాన్వీ దాస్ను మొదటిసారి బహిరంగంగా పరిచయం చేశాడు. ప్రశాంత్ కిషోర్ దాదాపు రెండు సంవత్సరాలుగా బీహార్ పర్యటనలో ఉన్నారు.
తన భార్యను పరిచయం చేస్తూ.. ‘డాక్టరేట్ విడిచిపెట్టిన తరువాత, మొత్తం కుటుంబ బాధ్యతను తీసుకున్నారు. మీరు బీహార్లో వెళ్లి మీకు కావలసినది చేసుకోవచ్చు. కుటుంబ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. ఈ రోజు నా భార్యను మీకు మొదటిసారిగా పరిచయం చేయడానికి పిలిచాను. మా భార్య పేరు డాక్టర్ జాన్వి.’ అంటూ చెప్పుకొచ్చారు. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ తన భార్యను పరిచయం చేస్తూనే, మరోవైపు ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన కొత్త ఉద్యమంపై ఏం చెబుతారని భార్యను ప్రశ్నించగా, జాన్వీ దాస్ స్పందించారు. తనకు నా పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
Read Also:Breaking News: బైక్ పై కూతురితో వెళ్తుండగా ఎస్సైను గుద్దిన టెంపో..బాలిక మృతి
జాన్వీ దాస్ ఎవరు?
ప్రశాంత్ కిషోర్ భార్య జాన్వీ దాస్ అస్సాంలోని గౌహతి నివాసి. వృత్తిరీత్యా వైద్యురాలు. రాజకీయ వ్యూహకర్తగా మారడానికి ముందు పీకే ఐక్యరాజ్య సమితి హెల్త్ ప్రోగ్రాంలో కూడా పనిచేశాడు. పీకే, జాన్వి కలుసుకున్న సమయం ఇది. ఐక్యరాజ్య సమితి హెల్త్ ప్రోగ్రామ్లో కలిసిన తరువాత, వారి స్నేహం ప్రేమగా మారింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పీకే, జాన్వీ దాస్లకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
పీకే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు?
ప్రశాంత్ కిషోర్ 2022 అక్టోబర్ 2న బీహార్లో బహిరంగ ప్రచారాన్ని ప్రారంభించాడు. దాని కింద అతను రాష్ట్ర పర్యటనలో ఉన్నాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు క్రమంగా దగ్గరపడుతుండగా పీకే ఈ ప్రచారాన్ని రాజకీయంగా మార్చారు. అక్టోబర్ 2న ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీని ప్రారంభించనున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. 2025లో జాన్ సూరజ్ 243 స్థానాల్లో పోటీ చేస్తోందని, అందులో జాన్ సూరజ్ తరపున కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు బరిలోకి దిగుతారని అన్నారు.
Read Also:Kannappa : మంచు ఫ్యామిలీ మూడో తరం .. ఫస్ట్ లుక్ రిలీజ్..
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!