సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో హనుమాన్ సినిమా ప్రభంజనాన్ని సృష్టించింది.. ఈ సినిమాను తెరకేక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఇండస్ట్రీలో మారుమోగి పోతుంది. సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్ వర్మ.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. సినిమా విడుదలై మూడు వారాలు గడిచిన జోరు తగ్గలేదు.. సినిమా క్రేజ్ అంతే రేంజ్ లో ఉంది.. ఇక ఓటీటి లో కూడా మరికొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది..
దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ప్రశాంత్ వర్మ మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. జై హనుమాన్ పేరుతో ఈ సినిమాకు సీక్వెల్ మరో సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అనౌన్స్ చేశారు.. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ ను మరోసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు..
ఇదిలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఈ మూవీ ఘన విజయం సాధించండంతో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి బిగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్నారని లేటేస్ట్ టాక్. అంతే కాదు దాదాపు రూ.6 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం.. అంతేకాదు కారును కూడా బుక్ చేసినట్లు వార్త చక్కర్లు కొడుతుంది.. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు కామన్.. గతంలో చాలానే విని ఉంటారు.. బేబీ డైరెక్టర్కు ఇలాగే నిర్మాత కారును గిఫ్ట్గా ఇచ్చారు. అంతే కాకుండా విశాల్ మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్కు కారు బహుమతిగా ఇచ్చి నిర్మాత సర్ప్రైజ్ ఇచ్చారు.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కు కూడా గిఫ్ట్ ను ఇస్తున్నారని తెలుస్తుంది..