Tirumala: రేపు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ..
- రేపు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ
- గురు పౌర్ణమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో గరుడసేవ
- ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన గరుడ సేవ నిర్వహిస్తున్న టీటీడీ
- రాత్రి 7 నుండి 9 గంటల నడుమ గరుడ సేవ
- గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్న శ్రీమలయప్ప స్వామివారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఆదివారం) గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. శ్రీ మలయప్ప స్వామిని వజ్ర కవచం, కిరీటం.. ఇతర ఆభరణాలతో అలంకరిస్తారు. బంగారు గరుడవాహనంపై ఆయనను అధిరోహించి.. ఏనుగులు, గుర్రాలు, ఎద్దులు పాల్గొంటుండగా సేవకులు చత్రం, చామరాలను పట్టుకుని తిరుమల వీధుల్లో ఊరేగిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
Read Also: Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
గరుడ వాహనం ప్రాముఖ్యత
గరుడుడు వరాహ స్వామి ఆజ్ఞ ప్రకారం వెంకటాద్రి కొండను తీసుకువచ్చి తిరుపతి పక్కన ఉంచాడు. దీనిని ఇప్పుడు తిరుమల కొండలుగా పిలుస్తున్నారు. గరుడ పక్షి వేంకటేశ్వరుని వాహనం. కాగా.. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి.. ఈ సమయంలో జెండా (గరుడ చిహ్నం ఉంటుంది) ఎగురవేస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోను గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని చెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెపుతున్నాడని ఆలయ పండితులు చెబుతున్నారు.
మరోవైపు.. గరుడసేవ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను అలంకరించేందుకు శ్రీవారి ఆలయంలో పీఠాధిపతులను అలంకరించే అరుదైన ఆభరణాలను గర్భగుడి నుండి బయటకు తీసుకువస్తారు. అరుదైన ఆభరణాలతో శ్రీ మలయప్ప స్వామి.. గరుడుని భుజాలపై గంభీరంగా కూర్చొని, ఆయన నియమిత వాహనం అయిన మలయప్ప స్వామి మాడ వీధుల్లో విహరించనున్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!