ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వీటిల్లో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు.. మీరు పెట్టిన డబ్బులకు రిస్క్ ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాంకుల్లో డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది. పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఇంతకీ ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఏంటో ఎలాంటి ప్రయోజనాలు పొందోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇందులో 5 ఏళ్లపాటు పెట్టుబడులు పెడితే ఎక్కువ వడ్డీని పొందొచ్చు. సెప్టెంబర్ 29, 2023 నుంచి కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో అన్ని చిన్న పొదుపు పథకాలపై కొత్త రేట్లు వర్తిస్తాయి. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ పోస్టాపీస్ రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటను 20 బేసిస్ పాయింట్లు 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది.. అంటే ఇప్పుడు వడ్డీ భారీగా పెరిగిందని తెలుస్తుంది..
రూ. 100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. పోస్టాఫీస్ ఆర్డీ మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు ఉంటుంది. అయితే 3 ఏళ్ల తర్వాత ప్రీ మెచ్యూర్ క్లోజర్ చేయవచ్చు. అంతేకాదు ఈ పథకంలో రుణాన్ని కూడా పొందొచ్చు. డిపాజిట్ ప్రారంభించిన తర్వాత అకౌంట్ ఏడాది యాక్టివ్గా ఉంటే చాలు.. డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతాన్ని రుణంగా తీసుకొవచ్చు.. మీరు రూ.5 వేలు పెట్టుబడి పొందారంటే, మీకు చివరికి రూ.3 లక్షలు మీ చేతికి వస్తుంది.. దీనికి మీకు 6.7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో మీకు వడ్డీ రూపంలో రూ. 56,830 జమ అవుతుంది. అంటే మీ మొత్తం ఫండ్ రూ. 3,56,830కి చేరుతుంది.. ఇలా మరో ఐదేళ్లు పొడిగిస్తే మీకు డబుల్ అవుతుంది.. మీరు పెట్టే పెట్టుబడి ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా పెరుగుతుంది.. ఇవేకాదు పోస్టాఫీస్ లో ఇంకా ఎన్నో స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చెయ్యండి..