Post Office Scheme: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రోజుకు రూ. 166 పొదుపుతో రూ. 8 లక్షలు పొందండి!
- రోజుకు రూ. 166 పొదుపుతో రూ. 8 లక్షలు అందుకోండి.
- పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మీకోసం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Post Office Scheme: తెలివైన పెట్టుబడి మంచి రాబడులను తెచ్చిపెడుతుంది. అయితే ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెడితే లాభాలు అందుకోవచ్చు. కానీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. లాభాల సంగతి దేవుడెరుగు.. ఉన్నది ఊడ్చుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాబట్టి భద్రతో కూడిన ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ప్రభుత్వ స్కీమ్స్ విషయానికి వస్తే.. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను దేశ ప్రజల కోసం అందుబాటులో ఉంచింది.
Also Read: Oppo Reno13: అత్యాధునిక ఫీచర్లతో భారత్ మార్కెట్లోకి వచ్చేసిన ఒప్పో రెనో 13 సిరీస్
Also Read
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలను అందుకునేలా పోస్టాఫీస్ పథకాలను రూపొందించింది. పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. మరి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ లో బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో రోజుకు రూ. 166 పొదుపు చేస్తే చాలు ఏకంగా రూ. 8 లక్షలు చేతికి వస్తాయి. ఈ పథకం పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో సింగిల్ ఇండివిడ్యుయల్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ పథకంలో కనిష్టంగా రూ. 100 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తంపై ఆధారపడి రాబడి ఉంటుంది. పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ మెచ్యూరిటీ కాల వ్యవధి 5 ఏళ్లు. ఎక్కువ కాలం పొదుపు చేయలనుకుంటే మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. ఈ పథకంలో 6.7 శాతం వడ్డీ వస్తుంది.
Also Read: Chhattisgarh: కూలిన చిమ్మీ.. నలుగురి మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న 30 మంది
రోజుకు రూ. 166 పొదుపుతో రూ. 8 లక్షలు:
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో రోజుకు రూ. 166 పొదుపు చేస్తే నెలకు రూ. 5 వేలు జమ అవుతుంది. అంటే ఏడాదికి రూ. 60 వేలు. ఇలా 5 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి మొత్తం రూ. 3 లక్షలు అవుతుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం మీ పెట్టుబడిపై వడ్డీ రూ. 56,800 వస్తుంది. 5 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత మీకు మొత్తంగా రూ. 3,56,800 వరకు చేతికి వస్తాయి. అయితే రూ. 8 లక్షలు పొందాలంటే మీరు ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగించాల్సి ఉంటుంది. అప్పుడు ఇన్వెస్ట్ మెంట్ మొత్తం రూ.6 లక్షలు అవుతుంది. దానిపై వడ్డీ రూ.2,54,300 వస్తుంది. మెచ్యూరిటీ కాలానికి చేతికి రూ. 8,54,300 వస్తుంది. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ బెటర్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.
తాజావార్తలు
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
Nithiin: ఫ్లాప్ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్బ్యాక్కు సిద్ధమైన నితిన్!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!