Poonam Pandey : పుకార్లు వ్యాప్తి చేసినందుకు పూనమ్ ను అరెస్ట్ చేస్తారా.. శిక్ష ఏంటంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Pandey : మోడల్, నటి పూనమ్ పాండే మరణ వార్తతో అందరూ షాక్ అయ్యారు. అయితే మరుసటి రోజు అంటే శనివారం పూనమ్ పాండే స్వయంగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసి తాను బతికే ఉందని చెప్పింది. పూనమ్ పాండే స్వయంగా తన మరణ వార్తను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ప్రచారం కోసం ప్రయత్నించింది. ఆమె చర్యపై సోషల్ మీడియాలో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ న్యూస్ను ప్రచారం చేసినందుకు పూనమ్ పాండేపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అన్న సందేహాలు జనాల్లో తలెత్తుతున్నాయి.
నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు పూనమ్ జైలు శిక్ష అనుభవించవచ్చు. దీనితో పాటు జరిమానా కూడా విధించవచ్చు. ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 67 ప్రకారం, ఎవరైనా మొదటిసారి సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు దోషిగా తేలితే, అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే రూ.5 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. నేరం పునరావృతమైతే నేరస్థుడు 5 సంవత్సరాల జైలు, 10 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
Also Read
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
Read Also:Canada–India relations: భారత్పై మరోసారి విషం చిమ్ముతున్న కెనడా..
ఇన్స్టాగ్రామ్లో వీడియోను పంచుకుంటూ ‘హలో నేను పూనమ్. నన్ను క్షమించండి, నేను బాధపెట్టిన వారికి క్షమాపణలు చెబుతున్నాను. అందరినీ ఆశ్చర్యపరచడమే నా ఉద్దేశం, ఎందుకంటే మనం ఎక్కువగా మాట్లాడని గర్భాశయ క్యాన్సర్ గురించి చర్చించాలనుకున్నాను. అవును, నా మరణానికి సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేశాను. అకస్మాత్తుగా మేమంతా గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడటం ప్రారంభించాము. ఇది నిశ్శబ్దంగా మీ జీవితాన్ని లాక్కునే వ్యాధి. ఈ వ్యాధి గురించి మరింత మాట్లాడవలసిన అవసరం ఉంది. నా మరణవార్త వల్ల అందరికీ ఈ వ్యాధి గురించి తెలిసినందుకు నేను గర్వపడుతున్నాను.’ అంటూ చెప్పుకొచ్చింది.
కంగనా రనౌత్, మునావర్ ఫరూఖీ, డైసీ షా, పూజా భట్ సహా పలువురు ప్రముఖులు ఆమె మరణవార్త పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్లో తన సంతాపాన్ని తెలియజేసింది. పూనమ్ పాండే తన రియాల్టీ షోలో భాగమైంది. ఇది చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ బారిన పడి యువతి ప్రాణాలు కోల్పోవడం విషాదం. పూనమ్ పాండే తన గర్భాశయ క్యాన్సర్ గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదని నటి సంభవనా సేథ్ చెప్పారు. ఖత్రోన్ కే ఖిలాడీ అనే రియాల్టీ షోలో పూనమ్తో కలిసి సంభవన్ పాల్గొంది.
Read Also:Telangana Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చ..
తాజావార్తలు
-
Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
-
Toxic Trailer: యష్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. ఒక్క ఫోన్ కాల్తో బెంగళూరుకు!
-
Varanasi : సూపర్ స్టార్ బర్త్డే స్పెషల్.. వారణాసి ‘రుద్ర’ ఫస్ట్లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
-
Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్కే!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!