Ponnam Prabhakar: ఉప ఎన్నికలో 25 వేల ఓట్లు వస్తే.. కిషన్ రెడ్డికి మరొకసారి పొన్నం ఛాలెంజ్!
- కిషన్ రెడ్డికి మరొకసారి పొన్నం ఛాలెంజ్
- నేను చెప్పింది చేయడానికి కిషన్ రెడ్డి సిద్ధమా?
- యూసఫ్ గూడలో ప్రచారంలో హైదరాబాద్ ఇంచార్జి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 25 వేలకు ఒక్క ఓటు తగ్గకుండా తీసుకువస్తే.. మీరేం (కిషన్ రెడ్డి) చెబితే అందుకు తాను సిద్ధం అని చెప్పారు. 25 వేల ఓట్లు బీజేపీ అభ్యర్థికి రాకపోతే.. తాను చెప్పింది చేయడానికి కిషన్ రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పది వేల లోపే బీజేపీకి ఓట్లు వస్తాయని పొన్నం ప్రభాకర్ జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసఫ్ గూడలో ప్రచారంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం పాల్గొన్నారు.
ఎన్టీవీతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా మాట్లాడుతూ… ‘మా అభ్యర్థి యువకుడు, స్థానికుడు, ఉత్సాహవంతుడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. గతంలో అధికారంలో ఉండి కూడా అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు మావైపు ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి అందించిన అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున సానుకూలంగా ఉన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అభివృద్ధి చేయించుకుంటున్నారో.. ఇక్కడి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి అభివృద్ధి చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పెన్షన్లు ఇచ్చిన నిధులను కూడా లెక్క చెబితే.. అది అభివృద్ధి అవుతుందా?. అభివృద్ధి చేయడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్ చేయడం. ఈ రెండు నెలల్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా 2500 కోట్ల అభివృద్ధి పనులను చేశాము’ అని అన్నారు.
Also Read
- Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
- OTR: కంట్లో నలుసు..
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Shreyas Iyer: ఆ ఇద్దరు అద్భుతం చేశారు.. గుడ్న్యూస్తో పాటు బ్యాడ్న్యూస్ కూడా చెప్పిన శ్రేయస్ అయ్యర్..
Also Read: Wine Shops Close: మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు షాప్స్ క్లోజ్!
‘దివంగత మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. ఇక మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ సమస్యలను రిప్రెంటేషన్ చేయడంలో విఫలమయ్యాడు. భవిష్యత్తులో జూబ్లీహిల్స్ సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కిషన్ రెడ్డికి సహకరించింది. అందుకే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గురుదక్షిణగా బీజేపీ అభ్యర్థిని బీఆర్ఎస్కు తాకట్టు పెట్టాడు. మీ ప్రచారం సరళి చూసిన ప్రజలు మీ సొంత ఎమ్మెల్యే రాజాసింగ్ బీఆర్ఎస్ పార్టీకి లొంగిపోయారని అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీలో మీ ఓటు ఎటు వేసిన సరే అనే ప్రవర్తన కనిపిస్తుందని ప్రజలే అంటున్నారు. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు.. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా మీ పార్లమెంట్ పరిధిలోకే వస్తది. మరి నా చాలెంజ్ కు కిషన్ రెడ్డి సిద్ధమా?. ప్రజల స్పందన చూస్తే కచ్చితంగా మెజారిటీతోనే జూబ్లీహిల్స్ గెలవబోతున్నాం’ అని మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
-
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
-
Story Board : జెన్ జి ఉద్యమాలు.. సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న యువత..
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!