Ponguleti Srinivas Reddy : మనిషి ఎక్స్ రే మాదిరిగా సర్వే జరుగుతుంది
- సమగ్ర కుటుంబ సర్వే శాస్త్రీయంగా జరుగుతోంది
- మనిషి ఎక్స్రే మాదిరిగా సర్వే జరుగుతోంది
- కులగణన సర్వేపై విపక్షాల విమర్శలు అర్థరహితం
- కోటి 16 లక్షల 14 వేల కుటుంబాలు ఉన్నట్లు అంచనా : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : సమగ్ర కుటుంబ సర్వే శాస్త్రీయంగా జరుగుతుందని, హడావుడి లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మనిషి ఎక్స్ రే మాదిరిగా సర్వే జరుగుతుందన్నారు. కోటి 16 లక్షల 14 వేల 349 కుటుంబాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నట్లు, 9వ తేదీ నుంచి సర్వే జరిగుతోందని, ఇప్పటివరకు 58.3% అంటే 67 లక్షల 76 వేల 203 కుటుంబాల సర్వే జరిగిందన్నారు మంత్రి పొంగులేటి. ఏ కుటుంబానికి ఏమి అవసరం? ఏ గ్రామానికి ఎం అవసరం అనేది సర్వే ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. ములుగు జిల్లా, నల్గొండ, జనగామ జిల్లాల్లో అధిక శాతం సర్వే పూర్తి అయ్యిందని, హైదరాబాద్ లో 37 శాతం సర్వే జరిగిందన్నారు. చేసిన సర్వేను ఫార్మేట్ ప్రకారం కంప్యూటరికరణ జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈనెల 30తో సర్వే ప్రక్రియ పూర్తి అవుతుందని, సరైన మార్గంలో సర్వే జరుగుతుందన్నారు.
Jio 5G: అదిరిపోయే ఆఫర్.. రూ.601తో ఏడాదంతా అన్లిమిటెడ్ డేటా
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
అంతేకాకుండా..’ఉనికి ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. సర్వే అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రాకుండా పోతాయని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఈ సర్వే వల్ల ఎలాంటి పథకాలు ఆగిపోవు. అర్హులైన వారికి పథకాలు తప్పకుండా వస్తాయి. సర్వేలో ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదు చేసుకోండి. ప్రతిపక్షాలు చెప్పేవన్ని నమ్మొద్దని ప్రభుత్వ విజ్ఞప్తి. రాజకీయ లబ్ది కోసమే సర్వే పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో మీరు చేసిన సర్వేని పేద ప్రజలకు మంచి చేసే పనులు ఏమైనా చేశారా? సర్వే వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు. ఆ సర్వే వివరాలు ఇప్పటికీ మాకే తెలియదు. సర్వే ద్వారా ప్రజల ఆస్తులను తెలుసుకుని మీ ఆస్తులుగా ట్రాన్స్ ఫర్ చేసుకుని మీ ఆస్తులు పెంచుకోవడానికి మీకు సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడింది. మీరు గత సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలేదు? మీ బావ భామర్ధి కుటుంబాలు కూడా సర్వేలో పాలు పంచుకోవాలి. ఎమ్మెల్సీ కవిత సర్వేలో పాల్గొన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరుపున అభినందనలు’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Modi- Lulada Silva: ప్రధాని మోడీ భుజంపై చేయి వేసి మాట్లాడిన బ్రెజిల్ అధ్యక్షుడు.. (వీడియో)
తాజావార్తలు
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!