‘విరోష్’ (విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న) వివాహ వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి. నేడు విజయ్ స్వగ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నారు. మరోవైపు విరోష్ రిసెప్షన్ కు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ వేడుకకు తమ సన్నిహితులు మరియు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్లో మార్చి 4వ తేదీ సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్ను ఏర్పాటు చేశారు.
Also Read : Nikhil : నిఖిల్ ‘స్వయంభు’.. భారీ ధరకు సీడెడ్ రైట్స్.. డీల్ క్లోజ్
అయితే, ఈ రిసెప్షన్ కేవలం పరిమిత సంఖ్యలో ఉన్న ఆహ్వానితులకు మాత్రమేనని స్పష్టమైంది. ఈ వేడుకకు భారీగా అభిమానులు మరియు సామాన్య ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. “ఇన్విటేషన్ కార్డు లేని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రిసెప్షన్ వేదిక వద్దకు రావొద్దు” అని పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. హోటల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఆంక్షలు విధిస్తున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ‘విరోష్’ టీమ్ కూడా అభిమానులకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. “మీ అందరి భద్రత మరియు క్షేమమే మాకు ముఖ్యం. ఆహ్వానం లేని వారు రిసెప్షన్ కార్యక్రమానికి వచ్చి ఇబ్బందులు పడవద్దని కోరుతున్నాము. మీరు ఎక్కడున్నా మీ దీవెనలు, ఆశీస్సులు మాకు అందుతాయని ఆశిస్తున్నాము” అని విజయ్ మరియు రశ్మిక ప్రతినిధులు తెలిపారు. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు, మిత్రులు మరియు సినీ ప్రముఖులతో ఈ వేడుక ప్రైవేట్గా జరగనుందని వారు స్పష్టం చేశారు.
