Police Notice to Manchu Manoj: మంచు మనోజ్కు పోలీసుల నోటీసులు..! ఇక్కడి రావొద్దు..!
- మంచు మనోజ్కు పోలీసుల నోటీసులు..
- మోహన్బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తారన్న సమచారం..
- శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి లేదంటూ మనోజ్ కి నోటీసులు..
- ఎంబీయూ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని..
- పోలీసులకు సమాచారం ఇచ్చిన మోహన్ బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Notice to Manchu Manoj: మంచు ఫ్యామిలీలో వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.. హైదరాబాద్లోని మోహన్బాబు ఇంటి దగ్గర జరిగిన ఘటన పెద్ద చర్చగా మారగా.. ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం కాస్త చల్లబటినట్టు కనిపిస్తోన్న సమయంలో.. మంచు మనోజ్ పర్యటన మరోసారి కాకరేపుతోంది.. అయితే, మంచు మనోజ్కు తాజాగా నోటీసులు జారీ చేశారు పోలీసులు.. తిరుపతిలోని మోహన్బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తారన్న సమచారంతో అప్రమత్తమైన పోలీసులు.. శాంతి భద్రతల దృష్ట్యా.. మోహన్బాబు యూనివర్సిటీలోకి అనుమతి లేదంటూ మనోజ్ నోటీసులు ఇచ్చారు.. మరోవైపు.. మంచు మనోజ్.. ఎంబీయూకి వస్తారన్న సమాచారంతో పోలీసులను మోహన్బాబు ఆశ్రయించారు.. మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయనే విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్ లోనే మోహన్ బాబు ఉన్నారు.. అయితే, మోహన్ బాబు సమాచారం మేరకు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.. వర్సిటీలో బౌన్సర్లను కూడా మోహరించినట్టుగా తెలుస్తోంది..
Read Also: Dollar Vs Rupee: డాలర్తో పోలిస్తే ఆల్ టైం కనిష్ఠానికి రూపాయి విలువ
Also Read
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
- O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
- China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్ను దించిన చైనా!
కాగా, తిరుపతి పర్యటనలో ఉన్న మంచు మనోజ్.. తాను మోహన్బాబు యూనివర్సిటీకి రానున్నట్టు.. తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు.. తన పర్యటనపై మీడియాకు కూడా సమాచారం ఇచ్చారు మంచు మనోజ్.. మొదట తిరుపతిలోని బంధువుల నివాసానికి వెళ్లిన ఆయన.. ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం నుంచి ర్యాలీగా.. మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) క్యాంపస్కి వెళ్తారని.. అక్కడి నుంచి నారావారిపల్లెకు వెళ్తారని.. జల్లికట్టు కార్యక్రమానికి హాజరై.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతారని.. ఆ తర్వాత మధ్యాహ్నం తిరిగి MBU క్యాంపస్కి వెళ్తారని.. అనాథ శరణాలయాలను సందర్శిస్తారని మంచు మనోజ్ టీమ్ షెడ్యూల్ విడుదల చేసింది.. అయితే, పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. మనోజ్.. ఎంబీయూకి దూరంగా ఉంటారా? పోలీసుల ఆదేశాలను ధిక్కరించి మోహన్బాబు యూనివర్సిటీకి వెళ్తారా? అనేది ఉత్కంఠగా మారింది.. మరోవైపు, ఇప్పటికే తిరుపతి నుంచి నారావారిపల్లెకు వెళ్తోన్న సమయంలో ఎంబీయూ వరకు ర్యాలీగా వచ్చారు.. అయితే, పోలీసులను చూసి.. ఏదైనా పబ్లిక్ ఇష్యూ జరిగినా..? ఇంత మంది పోలీసులు ఉండరేమో అని వ్యాఖ్యానించారు.. అయితే, కోర్డు ఆర్డర్ ఉందని పోలీసులు చెప్పడంతో.. నాకు ఇవ్వండి అని అడిగిన మనోజ్కు ఆ ఆర్డర్కు సంబంధించిన కాపీని పోలీసులు అందజేశారు.. ఇక, నారావారిపల్లెకు వెళ్లిన మంచు మనోజ్, మౌనిక దంపతులు.. మంత్రి నారా లోకేష్ ని కలిశారు.. అక్కడి నుంచి రంగంపేట చేరుకున్న జల్లికట్టు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు.. ఆ తర్వాత వారి పర్యటనలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి మరి..
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
-
O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!