Police Notice to Manchu Manoj: మంచు మనోజ్కు పోలీసుల నోటీసులు..! ఇక్కడి రావొద్దు..!
- మంచు మనోజ్కు పోలీసుల నోటీసులు..
- మోహన్బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తారన్న సమచారం..
- శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి లేదంటూ మనోజ్ కి నోటీసులు..
- ఎంబీయూ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని..
- పోలీసులకు సమాచారం ఇచ్చిన మోహన్ బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Notice to Manchu Manoj: మంచు ఫ్యామిలీలో వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.. హైదరాబాద్లోని మోహన్బాబు ఇంటి దగ్గర జరిగిన ఘటన పెద్ద చర్చగా మారగా.. ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం కాస్త చల్లబటినట్టు కనిపిస్తోన్న సమయంలో.. మంచు మనోజ్ పర్యటన మరోసారి కాకరేపుతోంది.. అయితే, మంచు మనోజ్కు తాజాగా నోటీసులు జారీ చేశారు పోలీసులు.. తిరుపతిలోని మోహన్బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తారన్న సమచారంతో అప్రమత్తమైన పోలీసులు.. శాంతి భద్రతల దృష్ట్యా.. మోహన్బాబు యూనివర్సిటీలోకి అనుమతి లేదంటూ మనోజ్ నోటీసులు ఇచ్చారు.. మరోవైపు.. మంచు మనోజ్.. ఎంబీయూకి వస్తారన్న సమాచారంతో పోలీసులను మోహన్బాబు ఆశ్రయించారు.. మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయనే విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్ లోనే మోహన్ బాబు ఉన్నారు.. అయితే, మోహన్ బాబు సమాచారం మేరకు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.. వర్సిటీలో బౌన్సర్లను కూడా మోహరించినట్టుగా తెలుస్తోంది..
Read Also: Dollar Vs Rupee: డాలర్తో పోలిస్తే ఆల్ టైం కనిష్ఠానికి రూపాయి విలువ
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
కాగా, తిరుపతి పర్యటనలో ఉన్న మంచు మనోజ్.. తాను మోహన్బాబు యూనివర్సిటీకి రానున్నట్టు.. తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు.. తన పర్యటనపై మీడియాకు కూడా సమాచారం ఇచ్చారు మంచు మనోజ్.. మొదట తిరుపతిలోని బంధువుల నివాసానికి వెళ్లిన ఆయన.. ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం నుంచి ర్యాలీగా.. మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) క్యాంపస్కి వెళ్తారని.. అక్కడి నుంచి నారావారిపల్లెకు వెళ్తారని.. జల్లికట్టు కార్యక్రమానికి హాజరై.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతారని.. ఆ తర్వాత మధ్యాహ్నం తిరిగి MBU క్యాంపస్కి వెళ్తారని.. అనాథ శరణాలయాలను సందర్శిస్తారని మంచు మనోజ్ టీమ్ షెడ్యూల్ విడుదల చేసింది.. అయితే, పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. మనోజ్.. ఎంబీయూకి దూరంగా ఉంటారా? పోలీసుల ఆదేశాలను ధిక్కరించి మోహన్బాబు యూనివర్సిటీకి వెళ్తారా? అనేది ఉత్కంఠగా మారింది.. మరోవైపు, ఇప్పటికే తిరుపతి నుంచి నారావారిపల్లెకు వెళ్తోన్న సమయంలో ఎంబీయూ వరకు ర్యాలీగా వచ్చారు.. అయితే, పోలీసులను చూసి.. ఏదైనా పబ్లిక్ ఇష్యూ జరిగినా..? ఇంత మంది పోలీసులు ఉండరేమో అని వ్యాఖ్యానించారు.. అయితే, కోర్డు ఆర్డర్ ఉందని పోలీసులు చెప్పడంతో.. నాకు ఇవ్వండి అని అడిగిన మనోజ్కు ఆ ఆర్డర్కు సంబంధించిన కాపీని పోలీసులు అందజేశారు.. ఇక, నారావారిపల్లెకు వెళ్లిన మంచు మనోజ్, మౌనిక దంపతులు.. మంత్రి నారా లోకేష్ ని కలిశారు.. అక్కడి నుంచి రంగంపేట చేరుకున్న జల్లికట్టు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు.. ఆ తర్వాత వారి పర్యటనలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి మరి..
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!