NTV Telugu Site icon

Murder Mystery: బంగారమ్మపేటలో మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు

Murder

Murder

Murder Mystery: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం బంగారమ్మపేటలో మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. బంగారమ్మపేట గ్రామానికి చెందిన వివాహిత తాడితూరి అనూష (20) అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందింది. 5 రోజుల క్రితం బంగారమ్మ పేటలో ఇంటికి కూతవేటు దూరంలో అనూష శవమై పడి ఉంది. తొలుత ఆత్మహత్యగా పోలీసులు భావించారు. కుటుంబ‌ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యపై అనుమానంతో భర్త నక్కా జగదీష్ హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.

Read Also: Chirala: ఈపూరుపాలెం యువతి హత్య కేసును 48 గంటల్లోపే ఛేదించిన పోలీసులు

జగదీష్ సీఆర్పీఎఫ్ జవాన్.. జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుపై వచ్చి కొద్ది రోజులు విజయనగరంలో జగదీష్ మకాం వేశాడు. గ్రామ దేవత పండుగ రోజు భార్య అనూషను నైలాన్ తాడుతో ఉరివేసి జగదీష్ హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. భార్యప అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. అనుమానం రాకుండా ఉండే విధంగా అనూష సెల్ నుంచి కుటుంబ సభ్యులకు నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజులు పెట్టాడు. జగదీష్ ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. ఆ సమయంలో జగదీష్ ఆ లొకేషన్‌లోనే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. జగదీష్, అనూషలది ప్రేమ వివాహం కావడం విశేషం. బంగారమ్మ పేట గ్రామానికి చెందిన నక్కా జగదీష్‌తో నాలుగు నెలల క్రితం అనూషకు వివాహం జరిగినట్లు తెలిసింది.