Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Pok Will Reunite With India Soon Says Defence Minister Rajnath Singh At Cii Summit

Rajnath Singh: ఏదో ఒకరోజు POKను భారత్‌లో కలిపేస్తాం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..!

NTV Telugu Twitter
Published Date :May 29, 2025 , 1:58 pm
By Kothuru Ram Kumar
  • PoK ప్రజలు మనవారే..
  • భౌగోళికంగా, రాజకీయంగా వేరైనా వారు త్వరలోనే భారత్‌లో కలుస్తారని ఆశాభావం
  • PoKపై భావోద్వేగ బంధం
  • కొందరు తప్పుదారి పట్టినా, ఎక్కువమంది భారత్‌తో అనుబంధంగా ఉన్నారు.
  • “నేను భారతదేశం, నేను తిరిగి వచ్చాను” అని పీవోకే ఓ రోజు చెప్పే పరిస్థితి వస్తుంది.
  • కేవలం ఉగ్రవాదం, PoKపై మాత్రమే చర్చలు
  • గతంలో రూ. 1,000 కోట్ల కంటే తక్కువగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు రూ. 23,500 కోట్లు.
  • స్వదేశీ తయారీతో ఆపరేషన్ సిందూర్ విజయవంతం.
Rajnath Singh: ఏదో ఒకరోజు POKను భారత్‌లో కలిపేస్తాం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన CII బిజినెస్ సమ్మిట్లో ప్రసంగించిన ఆయన, PoK ప్రజలు భారత్ కుటుంబంలోని భాగమే అంటూ, త్వరలోనే వారు భారత్ లో కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు మా సొంతవారు, మా కుటుంబ సభ్యులే అంటూ పేర్కొన్నారు. ఇప్పుడు భౌగోళికంగా, రాజకీయంగా వేరుపడిపోయిన మా సోదరులు త్వరలోనే భారత్ లో ఏకమవుతారన్నారు.

Read Also: TVS Jupiter 125 DT SXC: స్టన్నింగ్ లుక్స్, స్మార్ట్ కనెక్టివిటీ పీసీలతో కేవలం రూ. 80,740కే టీవీఎస్ జుపిటర్ 125 DT SXC లాంచ్..!

PoK ప్రజలతో భారతదేశానికి గాఢమైన భావోద్వేగ బంధం ఉందని మంత్రి తెలిపారు. అక్కడి ప్రజల్లో ఎక్కువమంది భారత్‌ తో అనుబంధంగా ఉన్నారని, కొంతమంది మాత్రమే తప్పుదారి పట్టినట్టు అన్నారు. భారతదేశం ఎప్పుడూ హృదయాలను కలిపే విషయాలే మాట్లాడుతుంది. ప్రేమ, ఐక్యత, సత్యం మార్గంలో నడుస్తూ.. మన స్వంత భాగం పీవోకే తిరిగి వచ్చి “నేను భారతదేశం, నేను తిరిగి వచ్చాను” అని చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని తాము నమ్ముతున్నట్లు ఆయన అన్నారు.

Read Also: Shrashti Verma: తెల్ల చీరలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ..!

అలాగే ఉగ్రవాద వ్యాపారం లాభదాయకం కాదు.. దాని వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంటూ.. పాకిస్తాన్ ఇప్పటికే దీనిని ఎదుర్కొంటోందని, ఇస్లామాబాద్‌కు గట్టిగా హెచ్చరికలు జారీ చేసారు. ఇకపై భారత్, పాకిస్థాన్‌తో చర్చలు జరిపేది ఉగ్రవాదం, PoK విషయంలో మాత్రమేనని స్పష్టం చేశారు. అలాగే భారత రక్షణ రంగం ప్రగతిని గుర్తుచేస్తూ మాట్లాడిన ఆయన, స్వావలంబన సైనిక సామర్థ్యాలను నిర్మించడంలో దేశం ఎంతవరకు పురోగతి చెందిందో సింగ్ హైలైట్ చేశారు. భారతదేశ రక్షణ ఎగుమతి 10 సంవత్సరాల క్రితం రూ. 1,000 కోట్ల కంటే తక్కువగా ఉండేది.. కానీ, ఇప్పుడు అది రూ. 23,500 కోట్ల రికార్డు స్థాయికి చేరుకుందని ఆయన అన్నారు. ఇప్పటికే స్వదేశీ తాయారీ వ్యవస్థలతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని పేర్కొన్నారు. ఇప్పుడు భారత్ విదేశాలపై ఆధారపడకుండా ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలు తయారు చేస్తోంది. అంతేకాక భవిష్యత్ యుద్ధ సాంకేతికత కోసం కూడా భారత్ సిద్ధమవుతోందని వివరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CII Summit 2024
  • India-PoK Relations
  • Indian Army Modernisation
  • PoK
  • Rajnath PoK Speech

తాజావార్తలు

  • Rains : తెలంగాణలో జూన్ 15 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

  • Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య కేసులో కుట్రదారుడు అక్తర్ అరెస్ట్

  • Body Found In Freezer: వెలుగులోకి మరో హనీమూన్ కేసు.. ఐస్ క్రీం ఫ్రీజర్‌లో శవం..

  • Thammudu : ఇదేంటి దిల్ రాజు ఇలా ఓపెన్ అయ్యాడు?

  • SS Pharma: ఫార్మాసిటీలో విషవాయువు లీక్.. ఇద్దరు మృతి..!

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions