టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది శ్రష్టి వర్మ.
శ్రష్టి వర్మ తన కెరీర్ను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్గా ప్రారంభించారు.
జైలర్, విక్రాంత్ రోణా, రంగస్థలం, పుష్ప, మావీరన్ వంటి ప్రముఖ చిత్రాల్లో పని చేశారు.
శ్రష్టి వర్మ 'పుష్ప 2' చిత్రంలో టైటిల్ సాంగ్ 'పుష్ప.. పుష్ప..' కు విజయ్ పోలకితో కలిసి కొరియోగ్రఫీ చేశారు.
తన కెరీర్లో నటనలో కూడా అడుగుపెట్టారు. జానీ మాస్టర్ హీరోగా నటించిన 'యథా రాజా తథా ప్రజ' చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించారు.
ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్నాయి. జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ శ్రష్టి వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.