POK: పీఓకేలో తిరుగుబాటు.? పాకిస్తాన్కు వ్యతిరేకంగా జెన్-Z నిరసనలు..
- పీఓకేలో తిరుగుబాటు తప్పదా..
- నెల తిరగకముందే మరో ఉద్యమం..
- ఈసారి జెన్-జీ నేతృత్వంలో నిరసనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) హింసాత్మక ఆందోళనలు జరిగిన కొన్ని వారాల తర్వాత, మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ఈసారి జెన్-Z నేతృత్వం నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థులు విద్యా సంస్కరణలపై, పెరుగుతున్న ఫీజులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి శాంతియుత నిరసనలు ప్రారంభమయ్యాయి. అయితే, ఇటీవల నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపైకి గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. దీంతో, విద్యార్థులు టైర్లు తగలబెట్టడంతో పాటు విధ్వంసానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ లోని షెహజాబ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేపాల్, బంగ్లాదేశ్ లోని విద్యార్థి ఉద్యమం తరహాలో ఈ నిరసనలు కూడా ఎగిసిపడుతున్నాయి.
పెరుగుతున్న ఫీజులు, మెరుగైన సౌకర్యాల డిమాండ్పై ముజఫరాబాద్ లోని యూనివర్సిటీల్లో నిరసనలు ప్రారంభమయ్యాయమి. సెమిష్టర్ ఫీజుల పేరుతో ప్రతీ 3-4 నెలలకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఈసారి ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. కొత్తగా డిజిటల్ అసెస్మెంట్ సిస్టమ్(ఈ-మార్కింగ్) ప్రవేశపెట్టడంపై వీరు ఆగ్రహంగా ఉన్నారు. పీఓకేలో అక్టోబర్ 30న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు వచ్చాయి. వీటిలో ఊహించిన దాని కన్నా తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు ఆరోపించారు. దీనికి ఈ విధామనే కారణమని చెప్పారు. కొన్ని సందర్భాల్లో పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు పాస్ అయినట్లు ఆరోపిస్తున్నారు.
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
Read Also: Google Watch 4: భారత్ లో గూగుల్ పిక్సెల్ వాచ్ 4 సేల్ ప్రారంభం.. ధర ఇన్ని వేలా?
గత నెలలో హింసాత్మక అల్లర్లు:
పన్నుల నుంచి ఉపశమనం, పిండి, విద్యుత్ పై సబ్సిడీలు, అభివృద్ధి ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం వంటి 30 డిమాండ్లపై గత నెలలో పీఓకే అట్టుడికింది. ఈ అల్లర్లలో 12 మందికి పైగా పౌరులు మరణించారు. చివరకు షరీఫ్ ప్రభుత్వం దిగివచ్చి ఆందోళనకారులతో ఒప్పందం చేసుకుని, కొన్ని కీలక డిమాండ్లకు అంగీకరించడంతో ఈ అల్లర్లు సద్దుమణిగాయి.
అయితే, ఈసారి మాత్రం యువత పెద్ద ఎత్తున పీఓకేలో నిరసనలు తెలుపుతున్నారు. ఇది ఇటీవల నేపాల్లో జరిగిన జెన్-జీ ఉద్యమాన్ని తలపిస్తోంది. 2024లో బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూడా విద్యార్థుల ఉద్యమమే కుప్పకూల్చింది. ఆమె పారిపోయి భారత్ రావాల్సి వచ్చింది. ఈ ఏడాది నేపాల్లో విద్యార్థి ఉద్యమాన్ని కేపీ ఓలీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఇక పాకిస్తాన్లో ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?