PM Viksit Bharat Rozgar Yojana: కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి వరం ఈ పథకం.. ఉచితంగా రూ. 15 వేలు పొందొచ్చు
- కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి వరం ఈ పథకం
- ఉచితంగా రూ. 15 వేలు పొందొచ్చు
- పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన' ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తు్న్నాయి. దీనిలో భాగంగా స్కిల్ సెంటర్స్ ఏర్పాటు, ఆర్థిక చేయూతనందించే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వాటిల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకం ఉంది. అదే పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన. ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరే వారు ఉచితంగా రూ. 15 వేలు పొందొచ్చు. ఉపాధి సంబంధిత ప్రోత్సాహక పథకం ‘పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. దేశంలో ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం అని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read:Russia Earthquake: సునామీ కారణంగా ఒడ్డుకు కొట్టికొచ్చిన భారీ తిమింగలాలు
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
- EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఇటీవల ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనకు ఆమోదం తెలిపింది. రూ. 99,446 కోట్ల బడ్జెట్తో, PMVBRY రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 1.92 కోట్ల మంది లబ్ధిదారులు తొలిసారిగా ఉద్యోగాల్లో చేరనున్నారు. ఈ పథకం ఆగస్టు 1, 2025, జూలై 31, 2027 మధ్య సృష్టించబడే ఉద్యోగాలకు వర్తిస్తుంది. ఆగస్టు 1 నుంచి ఈ పథకం అందుబాటులోకి రానుండగా కొత్తగా ఈపీఎఫ్ఓ లో రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు 15వేలు కేంద్రం జమ చేస్తుంది. రెండు విడుతలుగా పదిహేను వేలను బెనిఫీషియర్ అకౌంట్ లో జమ చేస్తామని అధికారులు తెలిపారు.
Also Read:CBI arrests IT Inspector: రూ.5 లక్షలు డిమాండ్.. లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఐటీ ఇన్స్పెక్టర్..
ఈ పథకాన్ని రెండు భాగాలుగా విభజించారు. పార్ట్-ఎ మొదటిసారిగా శ్రామిక శక్తిలో చేరే ఉద్యోగులపై దృష్టి పెడుతుంది. పార్ట్-బి యజమానులపై దృష్టి పెడుతుంది. పార్ట్-ఎ కింద, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో మొదటిసారి నమోదు చేసుకునే ఉద్యోగులకు రూ. 15,000 వరకు EPF జీతం అందిస్తుంది. నెలకు రూ. లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలను పొందగలరు. ఈ పథకం కింద అన్ని చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) మోడ్ ద్వారా చేయబడతాయి. పార్ట్-బి కింద, చెల్లింపులు యజమానుల పాన్తో అనుసంధానించబడిన ఖాతాకు నేరుగా జమ అవుతాయి.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
-
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
-
Kitchen Hygiene: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!