PM Viksit Bharat Rozgar Yojana: కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి వరం ఈ పథకం.. ఉచితంగా రూ. 15 వేలు పొందొచ్చు
- కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి వరం ఈ పథకం
- ఉచితంగా రూ. 15 వేలు పొందొచ్చు
- పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన' ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తు్న్నాయి. దీనిలో భాగంగా స్కిల్ సెంటర్స్ ఏర్పాటు, ఆర్థిక చేయూతనందించే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వాటిల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకం ఉంది. అదే పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన. ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరే వారు ఉచితంగా రూ. 15 వేలు పొందొచ్చు. ఉపాధి సంబంధిత ప్రోత్సాహక పథకం ‘పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. దేశంలో ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం అని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read:Russia Earthquake: సునామీ కారణంగా ఒడ్డుకు కొట్టికొచ్చిన భారీ తిమింగలాలు
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఇటీవల ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనకు ఆమోదం తెలిపింది. రూ. 99,446 కోట్ల బడ్జెట్తో, PMVBRY రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 1.92 కోట్ల మంది లబ్ధిదారులు తొలిసారిగా ఉద్యోగాల్లో చేరనున్నారు. ఈ పథకం ఆగస్టు 1, 2025, జూలై 31, 2027 మధ్య సృష్టించబడే ఉద్యోగాలకు వర్తిస్తుంది. ఆగస్టు 1 నుంచి ఈ పథకం అందుబాటులోకి రానుండగా కొత్తగా ఈపీఎఫ్ఓ లో రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు 15వేలు కేంద్రం జమ చేస్తుంది. రెండు విడుతలుగా పదిహేను వేలను బెనిఫీషియర్ అకౌంట్ లో జమ చేస్తామని అధికారులు తెలిపారు.
Also Read:CBI arrests IT Inspector: రూ.5 లక్షలు డిమాండ్.. లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఐటీ ఇన్స్పెక్టర్..
ఈ పథకాన్ని రెండు భాగాలుగా విభజించారు. పార్ట్-ఎ మొదటిసారిగా శ్రామిక శక్తిలో చేరే ఉద్యోగులపై దృష్టి పెడుతుంది. పార్ట్-బి యజమానులపై దృష్టి పెడుతుంది. పార్ట్-ఎ కింద, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో మొదటిసారి నమోదు చేసుకునే ఉద్యోగులకు రూ. 15,000 వరకు EPF జీతం అందిస్తుంది. నెలకు రూ. లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలను పొందగలరు. ఈ పథకం కింద అన్ని చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) మోడ్ ద్వారా చేయబడతాయి. పార్ట్-బి కింద, చెల్లింపులు యజమానుల పాన్తో అనుసంధానించబడిన ఖాతాకు నేరుగా జమ అవుతాయి.
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!