PM KISAN Samman Nidhi: రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి 12వ విడత కిసాన్ సమ్మాన్ నిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM KISAN Samman Nidhi: దీపావళికి ముందే రైతుల ఖాతాల్లో కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 12వ విడత నిధులు విడుదలయ్యాయి. దేశ రాజధానిలో రెండు రోజుల పాటు జరగనున్న పీఎం కిసాన్ సమ్మేళన్ 2022 సదస్సును ఇవాళ ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సమావేశం వేదికగా 12వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోడీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా రైతులకు రూ.16,000 కోట్ల విలువైన 12వ విడత నిధులను వారీ ఖాతాల్లో జమ చేసినట్లు ప్రధాని తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు ఏటా రూ. 6000 ఆర్థిక సాయం అందిస్తోంది. రూ. 2000 చొప్పున మూడు విడతలుగా ఈ నగదును బదిలీ చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు 12 సార్లు రైతుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. 12వ విడత కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 16 వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది.
‘ఒక దేశం, ఒకే ఎరువులు’ కింద రైతులకు చౌకైన, నాణ్యమైన ఎరువులు అందించబడతాయని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ప్రధాని మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన – ఒక దేశం, ఒకే ఎరువులు’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రధాన మంత్రి భారత్ యూరియా సంచులను ప్రారంభించారు. ఈ ఎరువులపై ‘భారత్’ అనే ఒకే బ్రాండ్ పేరుతో ఎరువులను విక్రయించడం జరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు.యూరియా ఉత్పత్తిలో భారతదేశం పురోగతి గమనించదగినదని కూడా ఆయన హైలైట్ చేశారు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
Boora Narsaiah Goud: ఈనెల 19న బీజేపీ కండువా కప్పుకోనున్న బూర నర్సయ్యగౌడ్
భారతదేశం నానో-యూరియా వినియోగం ద్వారా యూరియా ఉత్పత్తిలో ఆత్మనిర్భర్త దిశగా కృషి చేస్తోందన్నారు. ఇది భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఒక ప్రధాన మైలురాయిగా ఉంటుందని ప్రధాని అన్నారు. వ్యవసాయ ప్రయోజనాల కోసం నానో యూరియా తక్కువ ఖర్చుతో కూడుకున్న మాధ్యమంగా ఉద్భవిస్తుందన్నారు. అగ్రి స్టార్టప్ కాంక్లేవ్ ఎగ్జిబిషన్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎరువులపై ‘ఇండియన్ ఎడ్జ్’ అనే ఈ-మ్యాగజైన్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది ఇటీవలి పరిణామాలు, ధరల ధోరణి విశ్లేషణ, లభ్యత, వినియోగం మరియు రైతుల విజయగాథలతో సహా దేశీయ, అంతర్జాతీయ ఎరువుల దృశ్యాలపై సమాచారాన్ని ఈ మ్యాగజైన్ అందిస్తుంది.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!