Speaker of the Knesset Medal to PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవమైన స్పీకర్ అఫ్ ది నెస్సెట్ మెడల్ “Speaker of the Knesset Medal” ప్రదానం చేసింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ఆయన చేసిన ప్రసంగం సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అధికారికంగా అందజేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ అరుదైన స్థానం సంపాదించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెస్సెట్ (Knesset) ఈ మెడల్ ను అత్యున్నత గౌరవంగా పరిగణిస్తుంది.
PM Modi: తొమ్మిదేళ్ల తర్వాత ఇజ్రాయెల్లో మోడీ పర్యటన.. ‘నెస్సెట్’లో మార్మోగిన భారత్ పేరు!
భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ వ్యక్తిగత నాయకత్వం, కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును అందజేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచడంలో ఆయన పాత్ర కీలకమని ఇజ్రాయెల్ నాయకత్వం పేర్కొంది. ఈ గౌరవం ద్వారా నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికపై మరో ముఖ్యమైన గుర్తింపును పొందారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని కావడం విశేషం. అంతేకాకుండా ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాల నుంచీ అత్యున్నత పురస్కారాలు పొందిన కొద్ది మంది ప్రపంచ నాయకుల్లో మోదీ ఒకరిగా నిలిచారు.
PM Modi: తొమ్మిదేళ్ల తర్వాత ఇజ్రాయెల్లో మోడీ పర్యటన.. ‘నెస్సెట్’లో మార్మోగిన భారత్ పేరు!
2018లో ప్రధాని మోదీకి పాలస్తీనా ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అయిన “Grand Collar of the State of Palestine”ను ప్రదానం చేసింది. విదేశీ ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత గౌరవంగా ఇది పరిగణించబడుతుంది.
