PM Modi: మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ
- మూడు దేశాల పర్యటన
- ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ
- వివరాలు ఇలా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నైజీరియా, బ్రెజిల్, గయానాలలో తన ఐదు రోజుల మూడు దేశాల పర్యటన ముగిసింది. దింతో ఆయన గురువారం ఆయన గయానా నుండి బయలుదేరుతున్నట్లు ప్రకటిస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో ఒక పోస్ట్లో పేర్కొంది.
Also Read: Etela Rajender : మత్స్యకారులను రాజకీయంగా విస్మరిస్తున్నారు
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ప్రధాన మంత్రి ఆదివారం నైజీరియా చేరుకున్నారు. ఇది 17 సంవత్సరాలలో పశ్చిమ ఆఫ్రికా దేశానికి భారత ప్రధాని చేసిన మొదటి పర్యటన. అక్కడ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం భారతీయ సమాజంతో సంభాషించారు. అతని సందర్శన సమయంలో నైజీరియా జాతీయ అవార్డు, గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ (GCON)లు లభించాయి. ఈ ఘనతను అందుకున్న రెండవ విదేశీ ప్రముఖుడిగా మోడీ గుర్తింపు పొందాడు.
Also Read: Siddaramaiah: ఎగ్జిట్ పోల్స్పై నమ్మకం లేదు.. శనివారం ఫలితాలు వేరేగా ఉంటాయి
నైజీరియా నుండి, మోడీ G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు బ్రెజిల్కు వెళ్లారు. అక్కడ ఆయన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటిష్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్తో సహా ప్రపంచ నాయకులను కలిశారు. పలువురు ప్రపంచ నేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రధాని గయానాకు వెళ్లారు. 50 ఏళ్ల తర్వాత కరేబియన్ దేశానికి భారత దేశాధినేత తొలిసారిగా పర్యటించారు. కరేబియన్ భాగస్వామ్య దేశాల నాయకులు హాజరైన 2వ ఇండియా-కారికామ్ సమ్మిట్కు ఆయన సహ అధ్యక్షుడిగా ఉన్నారు. తన పర్యటన సందర్భంగా.. ప్రధాని మోడీకి గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ద్వారా దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కూడా లభించింది. గయానా పార్లమెంటు ప్రత్యేక సెషన్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ తరువాత రోజు జరిగిన ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో మాట్లాడారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?