సార్వత్రిక ఎన్నికల ముందు దేశ వ్యాప్తంగా మరిన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఆయా రైల్వేస్టేషన్లు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా మరిన్ని స్టేషన్లు అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరో 550కు పైగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోడీ (PM Modi) శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో కేంద్రం మార్పులు చేస్తోంది.
గత ఏడాది 508 స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు మరో 550 పైగా స్టేషన్ల అభివృద్ధికి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 50 పైగా స్టేషన్లు ఈ స్కీమ్కు ఎంపికయ్యాయి.
తెలంగాణలో..
తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్, జడ్చర్ల, షాద్నగర్, బేగంపేట్, ఉందా నగర్, యాకుత్ పురా, మేడ్చల్, మెదక్, బాసర తదితర స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఎంపికయ్యాయి. ఈ నెల 26న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి వర్చువల్గా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.