PM Modi: “మా నాన్న మోడీ చెబితేనే వింటారు”.. ఇన్ఫ్లుయెన్సర్ రీల్పై స్పందించిన ప్రధాని.. ప్రజలకు కీలక విజ్ఞప్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దేశ ప్రజల ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక సందేశం ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువరాజ్ దువా రూపొందించిన ఒక రీల్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలు చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. వాస్తవానికి.. సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్ అయిన యువరాజ్ దువా సరదాగా ఒక రీల్ చేశాడు. తన తండ్రికి మోడీ అంటే ఎంతో ఇష్టమని, ప్రధాని మోడీ చెబితే ఏం అయినా చేస్తారని చెప్పాడు. మోడీకి ఒక రిక్వెస్ట్ చేశాడు. యవరాజ్ తండ్రికి షుగర్ ఉందట. అయినా స్వీట్లు తినడం ఆపడం లేదట. తన కుటుంబీకులు ఎవ్వరు చెప్పినా వినడం లేదట. ప్రధాని మోడీ మాటలను మాత్రమే నా తండ్రి వింటారని యువరాజ్ అన్నాడు. అందుకే ప్రధాని మోడీకి ఒక అభ్యర్థన చేశాడు. దయ చేసి నెక్ట్స్ మన్ కీ బాత్ కార్యక్రమంలో షుగర్ కంట్రోల్ గురించి మాట్లాడండి. మీరు చెబితే మా నాన్న తప్పకుండా వింటారని యువరాజ్ పేర్కొన్నాడు.
READ MORE: Trump: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ వ్యూహం ఇదేనా? ఇరాన్ ఏం చేయబోతుంది?
Also Read
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
ఇక ఈ వీడియోపై ఇన్స్టాగ్రామ్లో ప్రధాని మోడీ స్పందించారు. యువరాజ్ దువాకి సంబంధించి వీడియోను స్టోరీలో షేర్ చేశారు. యువరాజ్ తండ్రితో పాటు దేశప్రజలందరూ చక్కెర వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అధిక చక్కెర వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరిస్తూనే, ప్రతిరోజూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని మోడీ సూచించారు. “మీ శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. బాగా తినండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. అధిక చక్కెర అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. ఊబకాయం ముప్పు కూడా పెరుగుతుంది. అలాగే, యోగాను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి ఇది ఒక గొప్ప మార్గం.” అని ప్రధాని పేర్కొన్నారు. ఇక ప్రధాని సందేశం ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ప్రధాని తన వీడియోను షేర్ చేయడం పట్ల యువరాజ్ దువా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన వీడియో ప్రధాని మోడీ వరకు చేరుతుందని అనుకోలేదన్నాడు.
తాజావార్తలు
-
Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
-
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
-
HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!