PM Modi: “మా నాన్న మోడీ చెబితేనే వింటారు”.. ఇన్ఫ్లుయెన్సర్ రీల్పై స్పందించిన ప్రధాని.. ప్రజలకు కీలక విజ్ఞప్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దేశ ప్రజల ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక సందేశం ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువరాజ్ దువా రూపొందించిన ఒక రీల్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలు చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. వాస్తవానికి.. సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్ అయిన యువరాజ్ దువా సరదాగా ఒక రీల్ చేశాడు. తన తండ్రికి మోడీ అంటే ఎంతో ఇష్టమని, ప్రధాని మోడీ చెబితే ఏం అయినా చేస్తారని చెప్పాడు. మోడీకి ఒక రిక్వెస్ట్ చేశాడు. యవరాజ్ తండ్రికి షుగర్ ఉందట. అయినా స్వీట్లు తినడం ఆపడం లేదట. తన కుటుంబీకులు ఎవ్వరు చెప్పినా వినడం లేదట. ప్రధాని మోడీ మాటలను మాత్రమే నా తండ్రి వింటారని యువరాజ్ అన్నాడు. అందుకే ప్రధాని మోడీకి ఒక అభ్యర్థన చేశాడు. దయ చేసి నెక్ట్స్ మన్ కీ బాత్ కార్యక్రమంలో షుగర్ కంట్రోల్ గురించి మాట్లాడండి. మీరు చెబితే మా నాన్న తప్పకుండా వింటారని యువరాజ్ పేర్కొన్నాడు.
READ MORE: Trump: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ వ్యూహం ఇదేనా? ఇరాన్ ఏం చేయబోతుంది?
Also Read
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
ఇక ఈ వీడియోపై ఇన్స్టాగ్రామ్లో ప్రధాని మోడీ స్పందించారు. యువరాజ్ దువాకి సంబంధించి వీడియోను స్టోరీలో షేర్ చేశారు. యువరాజ్ తండ్రితో పాటు దేశప్రజలందరూ చక్కెర వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అధిక చక్కెర వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరిస్తూనే, ప్రతిరోజూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని మోడీ సూచించారు. “మీ శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. బాగా తినండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. అధిక చక్కెర అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. ఊబకాయం ముప్పు కూడా పెరుగుతుంది. అలాగే, యోగాను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి ఇది ఒక గొప్ప మార్గం.” అని ప్రధాని పేర్కొన్నారు. ఇక ప్రధాని సందేశం ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ప్రధాని తన వీడియోను షేర్ చేయడం పట్ల యువరాజ్ దువా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన వీడియో ప్రధాని మోడీ వరకు చేరుతుందని అనుకోలేదన్నాడు.
తాజావార్తలు
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!