NTV Telugu Site icon

Swachh Bharat: స్వచ్ఛ భారత్ మిషన్‌కు పదేళ్లు పూర్తి.. పిల్లలతో కలిసి చీపురు పట్టిన ప్రధాని

Pm Modi

Pm Modi

Swachh Bharat: మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2014, అక్టోబర్ 2 న ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. నేటితో ఈ స్వచ్ఛ భారత్‌ మిషన్ పదేళ్లు పూర్తి చేసుకుంది. గాంధీ జయంతి సందర్భంగా చిన్నారులతో కలసి స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ రోజు ప్రజలు పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రధాని కోరారు.

Read Also: PM Modi: మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళులు

ప్రజల చొరవ ‘క్లీన్ ఇండియా’ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ‘నేను, నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియాన్‌లో భాగమయ్యాను. మీరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఈ చొరవ స్వచ్ఛభారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది’ అని మోడీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో స్వచ్ఛతా హి సేవా 2024 కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రతకు సంబంధించి రూ.9600 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.