PM Modi Tour: ముగిసిన ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. యూఏఈకి మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Tour: రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లారు. ప్రధాని మోదీ తన ఫ్రాన్స్ పర్యటనను “చిరస్మరణీయమైనది” అని అభివర్ణించారు. బాస్టిల్ డే వేడుకల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ ప్రజల ఆదరణ, ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ప్రధాని మోదీ ఇలా అన్నారు. “ఫ్రాన్స్ పర్యటన చిరస్మరణీయం. నేను బాస్టిల్ డేలో పాల్గొనడం వల్ల ఇది మరింత ప్రత్యేకమైనది.” అని అన్నారు.
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శుక్రవారం బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు గౌరవ అతిథిగా చాంప్స్లో జరిగిన బాస్టిల్ డే పరేడ్కు ప్రధాని మోదీ హాజరయ్యారు. “భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వ వార్షికోత్సవం సందర్భంగా, సైనిక బృందం నేతృత్వంలోని 241 మంది సభ్యుల ట్రై-సర్వీస్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కవాతులో పాల్గొంది” అని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. రాజ్పుతానా రైఫిల్స్ రెజిమెంట్తో పాటు పంజాబ్ రెజిమెంట్ నేతృత్వంలోని భారత ఆర్మీ బృందాన్ని నడిపించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్తో కూడా ఆయన సమావేశమై పూర్తి స్థాయి సంబంధాలను సమీక్షించారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Also Read: Us government : విద్యార్థుల రుణాలను మాఫీ చేయనున్న ప్రభుత్వం..
వ్యాపార సహకారాన్ని వైవిధ్యపరిచే మార్గాలను చర్చించడానికి ప్రధాని మోడీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ టాప్ సీఈవోలతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో, “నా స్నేహితుడు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్తో చాలా ఫలవంతమైన చర్చలు జరిగాయి. మేము మొత్తం ఇండియా-ఫ్రాన్స్ సంబంధాలను సమీక్షించాము” అని అన్నారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక శక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, ఇతర భవిష్యత్ రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం గురించి తాను ప్రత్యేకంగా సంతోషిస్తున్నాను అని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు లౌవ్రే మ్యూజియంలో ప్రధాని మోదీకి విందు ఇచ్చారు. గత 25 ఏళ్లలో ప్రపంచం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని, అయితే భారత్, ఫ్రాన్స్ మధ్య స్నేహం మరింతగా పెరుగుతూనే ఉందని ప్రధాని మోడీ అన్నారు. రెండు దేశాలు రాబోయే 25 సంవత్సరాల కోసం రోడ్మ్యాప్ను సిద్ధం చేశాయని, తమ భాగస్వామ్యం ప్రపంచ మంచికి శక్తి అని ఆయన అన్నారు.
Also Read: Israel: తెగిన తలను అతికించారు.. ఇజ్రాయెల్ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స
మేక్రాన్ నిర్వహించిన విందులో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “గత 25 ఏళ్లలో, ప్రపంచం అనేక ఒడిదుడుకులు, సవాళ్లను ఎదుర్కొంది, అయితే ఫ్రాన్స్, భారతదేశం మధ్య స్నేహం మరింత దృఢంగా ఉంది. పరస్పర అవగాహన, నమ్మకం, గౌరవం ఆధారంగా మేము సుదీర్ఘమైన, ముఖ్యమైన ప్రయాణాన్ని చేశాం. అధ్యక్షుడు మేక్రాన్ వ్యక్తిగత కృషి కారణంగా, మా సంబంధాలు అన్ని దిశలలో పురోగమిస్తున్నాయి.” అని మోడీ అన్నారు. రాబోయే 25 సంవత్సరాల కోసం రోడ్మ్యాప్ను సిద్ధం చేశామని, రెండు దేశాల సంక్షేమానికి మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి, భద్రతకు కూడా సహకరిస్తున్నామన్నారు.
ప్రపంచ ప్రయోజనాలకు మా భాగస్వామ్యం ఒక శక్తి అని మోడీ అన్నారు. ఈ విందులో ప్రధాని మోదీ భారత్-ఫ్రాన్స్ సంబంధాలను ప్రశంసించారు. బాస్టిల్ డే సందర్భంగా ఫ్రాన్స్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఫ్రాన్స్ ప్రజలతో కలిసి ఈ వేడుకను జరుపుకోవడం పట్ల తన సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు.ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ యేల్ బ్రౌన్-పివెట్, నేషనల్ అసెంబ్లీ ఇతర నేతలను కూడా ప్రధాని మోడీ కలిశారు. ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అందజేశారు.
Also Read: OTT: అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ ఉంటే అంతే సంగతులు.. ఓటీటీకు ప్రభుత్వం వార్నింగ్..
ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ఇవాళ(జులై 15)న అబుదాబికి వెళ్లారు. భారత్, యూఏఈలు ఫిన్టెక్, రక్షణ, భద్రత, ఇంధనంతో సహా వివిధ రంగాలలో నిమగ్నమై ఉన్నాయని ఆయన తెలిపారు. తన పర్యటనలో ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను కలుస్తారు, కాప్-28 సమావేశాన్ని యూఏఈ నిర్వహించనుంది. ఈ ఏడాది చివర్లో UNFCCC (COP-28) 28వ సమావేశానికి యూఏఈ ఆతిథ్యం ఇవ్వనుందని ప్రధాని మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!