Vande Bharat Express: ఢిల్లీ-వారణాసి రెండో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం వారణాసి-న్యూఢిల్లీ మధ్య రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. అదునాతన ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ రైలుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పలు గూడ్స్ రైళ్లను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య తో పాటు పలువురు పాల్గొన్నారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఆయన సోమవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Read Also: Covid Alert: పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండాలి
Also Read
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ప్రతీక అయిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉత్తరప్రదేశ్, దేశ రాజధాని మధ్య ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని హామీ ఇచ్చింది. డిసెంబర్ 20న సాధారణ కార్యకలాపాలను ప్రారంభించేందుకు షెడ్యూల్ చేయబడింది, ఈ రైలు వారణాసి, ప్రయాగ్రాజ్, కాన్పూర్, న్యూఢిల్లీలను కలుపుతుంది, యాత్రికులు, ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ వందే భారత్ రైలు మంగళవారం మినహాయించి మిగతా ఆరు రోజుల్లో ఉదయం 6 గంటలకు వారణాసిలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటల 5 నిమిషాలకు తిరిగి వారణాసికి చేరుకుంటుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ స్వీయ-చోదక సెమీ-హై-స్పీడ్ రైలు. అత్యుత్తమ డిజైన్, ఇంటీరియర్స్, వేగాన్ని కలిగి ఉంది. ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన మరియు సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
Read Also: Draupadi Murmu: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం
ఇదిలా ఉండగా.. ఇప్పటికే వారణాసి-ఢిల్లీ మార్గంలో ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తుండగా.. రద్దీ నేపథ్యంలో మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈ మార్గంలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ రైలులో అధునాతన ఫీచర్లు ఉంటాయి. వైఫై సదుపాయం, జీపీఎస్ ఆధారిత ఇన్ఫర్మేషన్ సిస్టం, బయో వాక్యూం టాయిలెట్స్, ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు, టచ్ బేస్డ్ రీడింగ్ లైట్లు వంటి అధునాతన సౌకర్యాలతో ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!