Parmliament Sessions: వాడీవేడిగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. మీడియాతో సంభాషించనున్న ప్రధాని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parmliament Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మీడియాతో సంభాషించే అవకాశం ఉందని లోక్సభ సెక్రటేరియట్ మంగళవారం తెలిపింది. పార్లమెంట్ సెషన్స్ బుధవారం ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. సభా కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో భాగంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు పార్లమెంట్ ఆవరణలో రక్షణ మంత్రి, లోక్సభ ఉపనేత రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. రెండు గంటల పాటు కొనసాగిన భేటీకి 30కిపైగా పార్టీల నేతలు విచ్చేశారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలను పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు సూచించాయి. దేశ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలపై విస్తృత చర్చ జరగాలని కాంగ్రెస్ పేర్కొంది. రాజ్యసభ సెక్రటేరియట్ సభ్యుల కోసం ప్రవర్తనా నియమావళిని విడుదల చేసింది.
Exit Polls: ఆప్కు భారీ ఎదురుదెబ్బ.. అదే పెద్ద విషయమన్న కేజ్రీవాల్
Also Read
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
ఇంటర్ సెషన్ వ్యవధిలో మరణించిన సభ్యులకు మొదటి రోజు లోక్సభ నివాళులర్పిస్తుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అక్టోబర్లో కన్నుమూసిన సమాజ్వాదీ పార్టీ పితామహుడు ములాయం సింగ్ యాదవ్, మరణించిన సభ్యులలో చిరస్మరణీయులు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఎగువ సభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా రాజ్యసభలో కార్యకలాపాలను నిర్వహించే ప్రారంభ సెషన్ ఇది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ఆగస్టు 8 మధ్య జరిగాయి. శీతాకాల సమావేశాల కోసం కేంద్రం అజెండాలో 16 కొత్త బిల్లులున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. దేశసరిహద్దుల భద్రత అంశంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
తాజావార్తలు
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!