Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. జాతికి అంకితం!
- పంబన్ బ్రిడ్జ్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- పంబన్ బ్రిడ్జ్ను జాతికి అంకితమిచ్చిన ప్రధాని
- రామేశ్వరం-తాంబరం కొత్త రైలును ప్రారంభించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీరామ నవమి 2025 సందర్భంగా భారతదేశంలోని మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ను (పంబన్ బ్రిడ్జ్) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రిమోట్ పద్ధతిలో పంబన్ బ్రిడ్జ్ను ప్రారంభించిన ప్రధాని.. వంతెనను జాతికి అంకితమిచ్చారు. అదే సమయంలో రామేశ్వరం-తాంబరం (చెన్నై) కొత్త రైలు సేవను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి రైలు బయలుదేరింది.
Also Read: Ayodhya Ram Mandir: అయోధ్యలో అద్భుత దృశ్యం.. బాలరాముడికి ‘సూర్యతిలకం’!
Also Read
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో పంబన్ బ్రిడ్జ్ను నిర్మించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును నాలుగు ఏళ్లలో పూర్తి చేసింది. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవున బ్రిడ్జ్ను తీర్చిదిద్దారు. బ్రిడ్జ్ దిగువన ఓడల రాకపోకలకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ రామేశ్వరం ద్వీపాన్ని భారత ఖండంతో అనుసంధానం చేస్తుంది. పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం భారతదేశ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 2019 మార్చి 1న ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. 2024 నవంబర్ నాటికి పూర్తయింది. 1914లో బ్రిటిష్ ఇంజనీర్లు నిర్మించిన పాత పాంబన్ బ్రిడ్జ్ 105 సంవత్సరాల పాటు సేవలందించింది. అయితే సముద్ర వాతావరణం వల్ల క్షీణించడం, తుప్పు పట్టడం వల్ల డిసెంబర్ 2022లో ఈ వంతెన ఉపయోగం ఆగిపోయింది.
Rameswaram, Tamil Nadu: PM Narendra Modi inaugurates New Pamban Bridge – India’s first vertical lift sea bridge and flags off Rameswaram-Tambaram (Chennai) new train service, on the occasion of #RamNavami2025 pic.twitter.com/6ts8HNdwqy
— ANI (@ANI) April 6, 2025
తాజావార్తలు
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!