Amrit Railway Stations: ప్రధానమంత్రి చేతుల మీదుగా దేశవ్యాప్తంగా 103 ‘అమృత్’ రైల్వే స్టేషన్ల ప్రారంభం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amrit Railway Stations: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 22 (గురువారం) నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 103 పునర్వికసిత రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. రూ.1,100 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణమైన ఈ రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) లో భాగంగా అభివృద్ధి చెంది ప్రయాణికులకు ఆధునిక వసతులతో కూడిన హబ్లుగా మారనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 86 జిల్లాల్లో ఉన్న ప్రధానమైన, చిన్న రైల్వే స్టేషన్లు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, కేరళ, చత్తీస్గఢ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పొండిచ్చేరిలు ఉన్నాయి.
Read also: Atchutapuram: పోలీసుల తనిఖీలు.. భారీ “సైబర్ డెన్” గుర్తింపు..!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఆంధ్రప్రదేశ్ లోని సుల్లూరుపేట రైల్వే స్టేషన్, తెలంగాణ లోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లు ఈ స్కీమ్ కింద ఆధునీకరించారు. ఈ స్టేషన్లను ప్రాంతీయ శైలిలో ఆకృతీకరించి, ఆధునిక ప్రయాణిక వసతులు, క్లీన్ టాయిలెట్లు, డిజిటల్ డిస్ప్లేలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు వంటి ఎన్నో ఆధునికతలతో తీర్చిదిద్దారు. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, బికానీర్ – ముంబయి మధ్య నూతన ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. అదే విధంగా దేశ్నోక్ లోని కర్నీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ్నోక్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అభివృద్ధి కార్యక్రమం ద్వారా భారతీయ రైల్వేలు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక అనుభవాన్ని అందించనున్నాయి.
Read also: Puri-Vijay : ‘బెగ్గర్’ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!