Operation Sindoor: “అంతా సిద్ధం” ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం..
- భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
- మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో మోడీ భేటీ
- మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై చర్చ
- ప్రణాళికలు వివరించిన మంత్రిత్వ శాఖ కార్యదర్శులు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో వివిధ మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రత, సన్నద్ధత మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం పై సమీక్ష జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖలు పరస్పర సమన్వయంతో వ్యవస్థాగతంగా పటిష్టం చేసుకోవడంతో పాటు, సమర్థవంతంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను ప్రధాని ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు మంత్రిత్వ శాఖల ప్రణాళికలు, సన్నద్ధతలపై సమీక్ష జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖల కార్యకలాపాలను సమీక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే ప్రతిస్పందించడం, అంతర్గత సమాచార వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం పై దృష్టి సారించేలా, సమగ్ర సమీక్ష చేయాలని కార్యదర్శులను ఆదేశించారు.
READ MORE: Operation Sindoor: “అంతా సిద్ధం” ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం..
Also Read
ప్రస్తుతం నెలకున్న పరిస్థితుల్లో, ప్రభుత్వ దృక్పథానికి తగ్గట్టుగా, తమ తమ శాఖల సన్నాహకాలను, ప్రణాళికలను కార్యదర్శులు వివరించారు. మంత్రిత్వ శాఖలు ఏలాంటి చర్యలను చేపట్టాలో ఇప్పటికే గుర్తించి, వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేసే ప్రక్రియలను బలోపేతం చేసుకుంటున్నాయి. తక్షణమే అమలులో పెట్టేలా సర్వసన్నద్దంగా ఉన్నాయి. పౌర రక్షణ వ్యవస్థలు బలోపేతం, తప్పుడు సమాచారం, అబద్దపు వార్తలను, ప్రచారాలను ఎదుర్కొనడంతో పాటు, కీలకమైన మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
READ MORE: Raj Gopal Nayar : పాత్ర కోసం 53 కిలోల బరువు తగ్గిన హీరో.. ప్రాణాలకే ప్రమాదం
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు, కిందిస్థాయి అధికార యంత్రాంగంతో, పూర్తి సమన్వయం తో కేంద్ర మంత్రిత్వ శాఖలు పనిచేసేందుకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ కార్యదర్శి, రక్షణ, హోం, విదేశీ వ్యవహారాలు, సమాచార & ప్రసార, విద్యుత్, ఆరోగ్య, టెలికమ్యూనికేషన్స్ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. దేశం అత్యంత సున్నితమైన కాలపరిస్థితులను ఎదుర్కుంటున్న ప్రస్తుత సమయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సంస్థలు, వ్యవస్థల మధ్య సమన్వయంతో పాటు, స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Israel-Lebanon: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి
-
BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
-
Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
-
Astrology: ఏప్రిల్ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!