Operation Sindoor: “అంతా సిద్ధం” ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం..
- భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
- మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో మోడీ భేటీ
- మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై చర్చ
- ప్రణాళికలు వివరించిన మంత్రిత్వ శాఖ కార్యదర్శులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో వివిధ మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రత, సన్నద్ధత మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం పై సమీక్ష జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖలు పరస్పర సమన్వయంతో వ్యవస్థాగతంగా పటిష్టం చేసుకోవడంతో పాటు, సమర్థవంతంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను ప్రధాని ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు మంత్రిత్వ శాఖల ప్రణాళికలు, సన్నద్ధతలపై సమీక్ష జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖల కార్యకలాపాలను సమీక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే ప్రతిస్పందించడం, అంతర్గత సమాచార వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం పై దృష్టి సారించేలా, సమగ్ర సమీక్ష చేయాలని కార్యదర్శులను ఆదేశించారు.
READ MORE: Operation Sindoor: “అంతా సిద్ధం” ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం..
Also Read
ప్రస్తుతం నెలకున్న పరిస్థితుల్లో, ప్రభుత్వ దృక్పథానికి తగ్గట్టుగా, తమ తమ శాఖల సన్నాహకాలను, ప్రణాళికలను కార్యదర్శులు వివరించారు. మంత్రిత్వ శాఖలు ఏలాంటి చర్యలను చేపట్టాలో ఇప్పటికే గుర్తించి, వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేసే ప్రక్రియలను బలోపేతం చేసుకుంటున్నాయి. తక్షణమే అమలులో పెట్టేలా సర్వసన్నద్దంగా ఉన్నాయి. పౌర రక్షణ వ్యవస్థలు బలోపేతం, తప్పుడు సమాచారం, అబద్దపు వార్తలను, ప్రచారాలను ఎదుర్కొనడంతో పాటు, కీలకమైన మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
READ MORE: Raj Gopal Nayar : పాత్ర కోసం 53 కిలోల బరువు తగ్గిన హీరో.. ప్రాణాలకే ప్రమాదం
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు, కిందిస్థాయి అధికార యంత్రాంగంతో, పూర్తి సమన్వయం తో కేంద్ర మంత్రిత్వ శాఖలు పనిచేసేందుకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ కార్యదర్శి, రక్షణ, హోం, విదేశీ వ్యవహారాలు, సమాచార & ప్రసార, విద్యుత్, ఆరోగ్య, టెలికమ్యూనికేషన్స్ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. దేశం అత్యంత సున్నితమైన కాలపరిస్థితులను ఎదుర్కుంటున్న ప్రస్తుత సమయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సంస్థలు, వ్యవస్థల మధ్య సమన్వయంతో పాటు, స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!