Operation Sindoor: “అంతా సిద్ధం” ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం..
- భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
- మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో మోడీ భేటీ
- మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై చర్చ
- ప్రణాళికలు వివరించిన మంత్రిత్వ శాఖ కార్యదర్శులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో వివిధ మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రత, సన్నద్ధత మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం పై సమీక్ష జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖలు పరస్పర సమన్వయంతో వ్యవస్థాగతంగా పటిష్టం చేసుకోవడంతో పాటు, సమర్థవంతంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను ప్రధాని ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు మంత్రిత్వ శాఖల ప్రణాళికలు, సన్నద్ధతలపై సమీక్ష జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖల కార్యకలాపాలను సమీక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే ప్రతిస్పందించడం, అంతర్గత సమాచార వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం పై దృష్టి సారించేలా, సమగ్ర సమీక్ష చేయాలని కార్యదర్శులను ఆదేశించారు.
READ MORE: Operation Sindoor: “అంతా సిద్ధం” ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం..
Also Read
ప్రస్తుతం నెలకున్న పరిస్థితుల్లో, ప్రభుత్వ దృక్పథానికి తగ్గట్టుగా, తమ తమ శాఖల సన్నాహకాలను, ప్రణాళికలను కార్యదర్శులు వివరించారు. మంత్రిత్వ శాఖలు ఏలాంటి చర్యలను చేపట్టాలో ఇప్పటికే గుర్తించి, వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేసే ప్రక్రియలను బలోపేతం చేసుకుంటున్నాయి. తక్షణమే అమలులో పెట్టేలా సర్వసన్నద్దంగా ఉన్నాయి. పౌర రక్షణ వ్యవస్థలు బలోపేతం, తప్పుడు సమాచారం, అబద్దపు వార్తలను, ప్రచారాలను ఎదుర్కొనడంతో పాటు, కీలకమైన మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
READ MORE: Raj Gopal Nayar : పాత్ర కోసం 53 కిలోల బరువు తగ్గిన హీరో.. ప్రాణాలకే ప్రమాదం
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు, కిందిస్థాయి అధికార యంత్రాంగంతో, పూర్తి సమన్వయం తో కేంద్ర మంత్రిత్వ శాఖలు పనిచేసేందుకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ కార్యదర్శి, రక్షణ, హోం, విదేశీ వ్యవహారాలు, సమాచార & ప్రసార, విద్యుత్, ఆరోగ్య, టెలికమ్యూనికేషన్స్ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. దేశం అత్యంత సున్నితమైన కాలపరిస్థితులను ఎదుర్కుంటున్న ప్రస్తుత సమయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సంస్థలు, వ్యవస్థల మధ్య సమన్వయంతో పాటు, స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!