ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో వివిధ మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రత, సన్నద్ధత మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం పై సమీక్ష జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖలు పరస్పర సమన్వయంతో వ్యవస్థాగతంగా పటిష్టం చేసుకోవడంతో పాటు, సమర్థవంతంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను ప్రధాని ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు మంత్రిత్వ శాఖల ప్రణాళికలు, సన్నద్ధతలపై సమీక్ష జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖల కార్యకలాపాలను సమీక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే ప్రతిస్పందించడం, అంతర్గత సమాచార వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం పై దృష్టి సారించేలా, సమగ్ర సమీక్ష చేయాలని కార్యదర్శులను ఆదేశించారు.
READ MORE: Operation Sindoor: “అంతా సిద్ధం” ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం..
ప్రస్తుతం నెలకున్న పరిస్థితుల్లో, ప్రభుత్వ దృక్పథానికి తగ్గట్టుగా, తమ తమ శాఖల సన్నాహకాలను, ప్రణాళికలను కార్యదర్శులు వివరించారు. మంత్రిత్వ శాఖలు ఏలాంటి చర్యలను చేపట్టాలో ఇప్పటికే గుర్తించి, వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేసే ప్రక్రియలను బలోపేతం చేసుకుంటున్నాయి. తక్షణమే అమలులో పెట్టేలా సర్వసన్నద్దంగా ఉన్నాయి. పౌర రక్షణ వ్యవస్థలు బలోపేతం, తప్పుడు సమాచారం, అబద్దపు వార్తలను, ప్రచారాలను ఎదుర్కొనడంతో పాటు, కీలకమైన మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
READ MORE: Raj Gopal Nayar : పాత్ర కోసం 53 కిలోల బరువు తగ్గిన హీరో.. ప్రాణాలకే ప్రమాదం
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు, కిందిస్థాయి అధికార యంత్రాంగంతో, పూర్తి సమన్వయం తో కేంద్ర మంత్రిత్వ శాఖలు పనిచేసేందుకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ కార్యదర్శి, రక్షణ, హోం, విదేశీ వ్యవహారాలు, సమాచార & ప్రసార, విద్యుత్, ఆరోగ్య, టెలికమ్యూనికేషన్స్ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. దేశం అత్యంత సున్నితమైన కాలపరిస్థితులను ఎదుర్కుంటున్న ప్రస్తుత సమయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సంస్థలు, వ్యవస్థల మధ్య సమన్వయంతో పాటు, స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.