Operation Sindoor: “అంతా సిద్ధం” ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం..
- భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
- మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో మోడీ భేటీ
- మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై చర్చ
- ప్రణాళికలు వివరించిన మంత్రిత్వ శాఖ కార్యదర్శులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో వివిధ మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రత, సన్నద్ధత మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం పై సమీక్ష జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖలు పరస్పర సమన్వయంతో వ్యవస్థాగతంగా పటిష్టం చేసుకోవడంతో పాటు, సమర్థవంతంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను ప్రధాని ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు మంత్రిత్వ శాఖల ప్రణాళికలు, సన్నద్ధతలపై సమీక్ష జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖల కార్యకలాపాలను సమీక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే ప్రతిస్పందించడం, అంతర్గత సమాచార వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం పై దృష్టి సారించేలా, సమగ్ర సమీక్ష చేయాలని కార్యదర్శులను ఆదేశించారు.
READ MORE: Operation Sindoor: “అంతా సిద్ధం” ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం..
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
ప్రస్తుతం నెలకున్న పరిస్థితుల్లో, ప్రభుత్వ దృక్పథానికి తగ్గట్టుగా, తమ తమ శాఖల సన్నాహకాలను, ప్రణాళికలను కార్యదర్శులు వివరించారు. మంత్రిత్వ శాఖలు ఏలాంటి చర్యలను చేపట్టాలో ఇప్పటికే గుర్తించి, వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేసే ప్రక్రియలను బలోపేతం చేసుకుంటున్నాయి. తక్షణమే అమలులో పెట్టేలా సర్వసన్నద్దంగా ఉన్నాయి. పౌర రక్షణ వ్యవస్థలు బలోపేతం, తప్పుడు సమాచారం, అబద్దపు వార్తలను, ప్రచారాలను ఎదుర్కొనడంతో పాటు, కీలకమైన మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
READ MORE: Raj Gopal Nayar : పాత్ర కోసం 53 కిలోల బరువు తగ్గిన హీరో.. ప్రాణాలకే ప్రమాదం
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు, కిందిస్థాయి అధికార యంత్రాంగంతో, పూర్తి సమన్వయం తో కేంద్ర మంత్రిత్వ శాఖలు పనిచేసేందుకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ కార్యదర్శి, రక్షణ, హోం, విదేశీ వ్యవహారాలు, సమాచార & ప్రసార, విద్యుత్, ఆరోగ్య, టెలికమ్యూనికేషన్స్ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. దేశం అత్యంత సున్నితమైన కాలపరిస్థితులను ఎదుర్కుంటున్న ప్రస్తుత సమయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సంస్థలు, వ్యవస్థల మధ్య సమన్వయంతో పాటు, స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!