PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. “దేశం కోసం.. భవిష్యత్తు కోసం.. మనందరి బాధ్యత” అనే నినాదంతో ప్రజలందరూ తమ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆయన కోరారు. కరోనా సంక్షోభం, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. ప్రధాని సూచించిన కీలక సూచనలు ఇవే..
ఏడాది పాటు బంగారం కొనవద్దు:
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో, కనీసం ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని సూచించారు. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.
Also Read
- Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. అత్యవసరమైతేనే బయటకు రండి..!
- MLA Jagan: 'బెంగళూరును ఏలుతున్నాం' వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్పై కన్నడ సంఘాల ఆగ్రహం
- Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
- AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి:
ముడి చమురు దిగుమతులపై భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణ రక్షణ కోసం వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి:
కాలుష్య రహిత భారతం కోసం సాంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వాడకాన్ని పెంచాలని, పర్యావరణ హితమైన రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్స్:
ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసేందుకు.. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని అనుసరించాలని, సమావేశాలను ఆన్లైన్ వేదికల ద్వారా నిర్వహించుకోవాలని తెలిపారు.
విదేశీ పర్యటనలు తగ్గించాలి:
దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, విదేశాలకు తరలిపోయే ధనాన్ని అరికట్టడానికి విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని సూచించారు.
వంట నూనెల వినియోగం:
ఆరోగ్యపరంగా, దిగుమతి భారం తగ్గించే ఉద్దేశంతో వంట నూనెల వినియోగంలో పొదుపు పాటించాలని కోరారు.
రసాయనిక ఎరువుల వాడకం:
నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడటానికి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రసాయనిక ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు.
సోలార్ పంపులు:
వ్యవసాయ రంగంలో విద్యుత్ ఆదా కోసం సోలార్ పంపు సెట్లను వినియోగించాలని, తద్వారా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు అడుగులు వేయాలని సూచించారు.
స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత:
స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా దేశీయ పరిశ్రమలను, చేతివృత్తుల వారిని ఆదుకోవాలని.. ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పాటించాలని కోరారు.
ఆడంబరాలు తగ్గించాలి:
మధ్య తరగతి కుటుంబాలు అనవసరపు ఖర్చులను, ఆడంబరాలను తగ్గించుకుని పొదుపు వైపు మొగ్గు చూపడం ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు.
తాజావార్తలు
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. అత్యవసరమైతేనే బయటకు రండి..!
-
MLA Jagan: ‘బెంగళూరును ఏలుతున్నాం’ వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్పై కన్నడ సంఘాల ఆగ్రహం
-
Sai Pallavi: సహజ నటన, అభినయం.. సీతమ్మ పాత్రలో ఒదిగిపోయిన సాయిపల్లవి!
-
Colorful RimBook L1 Plus: AMD రైజెన్ 7 7735HS ప్రాసెసర్తో.. కలర్ ఫుల్ రిమ్బుక్ L1 ప్లస్ ల్యాప్టాప్ విడుదల
-
Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!