Amit Shah: దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని మోడీ కొత్త వేగం, శక్తిని అందించారు..
Amit Shah: దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వేగం, శక్తిని అందించారని, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు. రాజస్థాన్లో ‘సహకార్ కిసాన్ సమ్మేళన్’లో ప్రసంగించిన అమిత్ షా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను లక్ష్యంగా చేసుకుని తొలగించబడిన మంత్రి రాజేంద్ర గూడా “రెడ్ డైరీ”కి సంబంధించిన ఆరోపణలపై మండిపడ్డారు. ప్రధాని మోదీ నాయకత్వం, శాస్త్రవేత్తల కృషి వల్లే చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిందని, ఇది దేశంలో కొత్త శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని అమిత్ షా అన్నారు. ఈ కార్యక్రమంలో కొందరు నినాదాలు చేసిన వారిపై కూడా ఆయన మండిపడ్డారు.
Read Also: Nuh Voilence: నుహ్లో మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత.. 144 సెక్షన్ విధింపు..!
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
‘ప్రధాని మోడీ మన అంతరిక్ష యాత్రకు కొత్త వేగం, శక్తిని అందించారు… ఈరోజు నినాదాలు చేసిన ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను, వారు నినాదాలు చేసే బదులు చంద్రయాన్ను ముందుకు నెట్టి ఉంటే నినాదాలు చేసే స్థాయికి వచ్చేవారు కాదు.” అని అమిత్ షా అన్నారు. రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ‘‘ఈరోజుల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రెడ్ డైరీ అంటే చాలా భయపడుతున్నారు.. అయితే ఎందుకు భయపడుతున్నారు?… రెడ్ డైరీలో నల్లని డీడీలు దాగి ఉన్నాయి.. రెడ్ డైరీలో కోట్ల అవినీతి వివరాలు ఉన్నాయి.’’ అని అమిత్ షా ఆరోపించారు.
మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన రాజేంద్ర గూడా ‘రెడ్ డైరీ’కి సంబంధించిన ఆరోపణలు చేశారని, గెహ్లాట్ సహాయకుడు రాథోడ్ నివాసం నుంచి దానిని తీసుకున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఆరోపణలు నిరాధారమైనవని, గూఢాను ప్రత్యర్థి పార్టీ బలిపశువుగా చేసిందని గెహ్లాట్ అన్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలతో పాటు ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ కూడా ఉంది. వచ్చే నెలలో రాష్ట్రంలో నాలుగు ‘పరివర్తన్ యాత్ర’లను బీజేపీ ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?