Amit Shah: దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని మోడీ కొత్త వేగం, శక్తిని అందించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వేగం, శక్తిని అందించారని, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు. రాజస్థాన్లో ‘సహకార్ కిసాన్ సమ్మేళన్’లో ప్రసంగించిన అమిత్ షా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను లక్ష్యంగా చేసుకుని తొలగించబడిన మంత్రి రాజేంద్ర గూడా “రెడ్ డైరీ”కి సంబంధించిన ఆరోపణలపై మండిపడ్డారు. ప్రధాని మోదీ నాయకత్వం, శాస్త్రవేత్తల కృషి వల్లే చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిందని, ఇది దేశంలో కొత్త శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని అమిత్ షా అన్నారు. ఈ కార్యక్రమంలో కొందరు నినాదాలు చేసిన వారిపై కూడా ఆయన మండిపడ్డారు.
Read Also: Nuh Voilence: నుహ్లో మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత.. 144 సెక్షన్ విధింపు..!
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
‘ప్రధాని మోడీ మన అంతరిక్ష యాత్రకు కొత్త వేగం, శక్తిని అందించారు… ఈరోజు నినాదాలు చేసిన ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను, వారు నినాదాలు చేసే బదులు చంద్రయాన్ను ముందుకు నెట్టి ఉంటే నినాదాలు చేసే స్థాయికి వచ్చేవారు కాదు.” అని అమిత్ షా అన్నారు. రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ‘‘ఈరోజుల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రెడ్ డైరీ అంటే చాలా భయపడుతున్నారు.. అయితే ఎందుకు భయపడుతున్నారు?… రెడ్ డైరీలో నల్లని డీడీలు దాగి ఉన్నాయి.. రెడ్ డైరీలో కోట్ల అవినీతి వివరాలు ఉన్నాయి.’’ అని అమిత్ షా ఆరోపించారు.
మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన రాజేంద్ర గూడా ‘రెడ్ డైరీ’కి సంబంధించిన ఆరోపణలు చేశారని, గెహ్లాట్ సహాయకుడు రాథోడ్ నివాసం నుంచి దానిని తీసుకున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఆరోపణలు నిరాధారమైనవని, గూఢాను ప్రత్యర్థి పార్టీ బలిపశువుగా చేసిందని గెహ్లాట్ అన్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలతో పాటు ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ కూడా ఉంది. వచ్చే నెలలో రాష్ట్రంలో నాలుగు ‘పరివర్తన్ యాత్ర’లను బీజేపీ ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!