PM Modi Apologizes: నారీ సారీ.. మహిళలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Apologizes: జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రయత్నించాయో దేశం మొత్తం చూసిందన్నారు. ‘మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నా.. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ స్వార్థ రాజకీయాలకు మహిళా లోకం బలైంది. నారీశక్తిని ఎదగకుండా అడ్డుకున్నారు. మహిళల కలలను ధ్వంసం చేశారు’ అని అన్నారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం దారుణం.. నల్ల దుస్తులు ధరించినంత మాత్రాన చీకటి ఒప్పందాలను దాచి పెట్టలేరు. నేను అన్ని పొలిటికల్ పార్టీలతో పర్షనల్గా మాట్లాడాను. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరాను. మహిళా రిజర్వేషన్ల విషయంలో అవసరమైతే మీరే క్రెడిట్ తీసుకున్నా పర్వాలేదని చెప్పాను అని గుర్తు చేసుకున్నారు. అయినా చివరకు కాంగ్రెస్, డీఎంకే కలిసి బిల్లును అడ్డుకున్నాయి. ఈనెల 23న డీఎంకే, కాంగ్రెస్కు సరైన సమాధానం చెప్పాలని అన్నారు.
READ ALSO: Iran Attack On Indian Ships: భారత్ నౌకలపై దాడి.. ఇరాన్ రాయబారికి భారత్ సీరియస్ వార్నింగ్..
Also Read
- Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
- Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
- IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
మహిళా బిల్లును ఓడగొట్టి విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకొని విపక్షాలు పాపం చేశాయి. బిల్లును అడ్డుకోవడం మహిళల ఆత్మాభిమానంపై జరిగిన దాడి. తమకు జరిగిన అన్యాయాన్ని మహిళలు ఎప్పటికీ మరిచిపోరు. రిజర్వేషన్లను అడ్డుకున్న వారిని మహిళలు తప్పకుండా శిక్షిస్తారు. ఇది భ్రూణహత్యలతో సమానం అని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ కుటుంబ పార్టీలు. వాళ్లు మహిళలను ఎదగనీయరు. రిజర్వేషన్ల కోసం మహిళలు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఎంతో నిజాయితీతో తెచ్చిన బిల్లును అడ్డుకున్నారు. కాంగ్రెస్ పరాన్నజీవిలా తయారైంది. ఇతర పార్టీలపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు దక్కేలా బిల్లు తెచ్చాం. ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చాం. కానీ దీన్ని ఒప్పుకోవడానికి విపక్షాలు సిద్ధపడలేదు. దేశ ప్రజలను విభజించి లబ్ధి పొందాలన్నది కాంగ్రెస్ ఆలోచన. డీలిమిటేషన్ సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నారని కాంగ్రెస్ పై ప్రధాని విమర్శలు గుప్పించారు.
మహిళల అభ్యున్నతికి అడ్డుపడిన పరిస్థితులను భారత్ మొత్తం చూస్తుంది. వాళ్లు మహిళ ఆశలను అంతం చేశారు. మేం మహిళలకు చేయాలనుకున్న రిజర్వేషన్లను అమలు చేయలేకపోయాం, చట్టం చేయలేకపోయాము, మహిళా రిజర్వేషన్ల కోసం చట్టం చేయలేకపోయినందుకు భారతదేశంలోని మహిళలకు క్షమాపణ చెప్తున్నా అని ప్రధాని చెప్పారు. దేశ హితమే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని, కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ పార్టీ స్వార్థ రాజకీయాల వల్ల దేశ మహిళలకు అన్యాయం జరిగిందన్నారు. నా దేశంలోని కోట్లాదిమంది పార్లమెంటు వైపు చూసారు, బిల్లు అమలు కాకపోవడం నాకు దుఃఖాన్ని కలిగించింది, బాధ కలిగించిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమకు చేసిన అవమానాన్ని మహిళలు ఎన్నడూ మర్చిపోరు, మహిళా మనసులో వాళ్లు చేసిన పని ఎప్పటికీ నిలిచిపోతుంది, మహిళ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న నాయకులకు క్షేత్రస్థాయిలో మహిళలే సమాధానం చెప్తారని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
-
Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్పై కెప్టెన్ గిల్ రియాక్షన్
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..